Maharashtra: ఐదుగురికి జన్మ.. శిశువులందరినీ విక్రయించిన దంపతులు

ఎనిమిది నెలల చిన్నారిని అపహరించిన కేసులో దంపతులను మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో పోలీసులు అరెస్టు చేశారు.

Updated : 20 Nov 2022 07:14 IST

ఎనిమిది నెలల చిన్నారిని అపహరించిన కేసులో దంపతులను మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను విచారించగా దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకొచ్చాయి. రాజస్థాన్‌కు చెందిన యోగేంద్ర ప్రజాపతికి రీటా అనే మహిళతో 2017లో వివాహం జరిగింది. 2018లో వారికి ఓ పాప పుట్టగా ఆమెను రూ.25 వేలకు అమ్మేశారు. ఆ తరువాత మరో నలుగురు పిల్లల్ని కని వారిని కూడా విక్రయించారు. అనంతరం ఇతరుల పిల్లల్ని ఎత్తుకెళ్లి అమ్మడం ప్రారంభించారు. అలా ఈ నెల 10న నాగ్‌పుర్‌లోని బాలాఘాట్‌లో 8 నెలల పసికందును ఈ జంట అపహరించింది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులను పోలీసులు అరెస్టు చేసి విచారించగా.. వారు 51 నెలల్లో అయిదుగురు పిల్లలను కని అమ్మేసినట్లు తేలింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని