పెళ్లి తంతులో కొత్త పుంతలు
జీవితంలో కల్యాణం అనేది రెండు మనసుల మాంగల్య బంధం.. నిండు నూరేళ్లు కలిసి చేసే ప్రయాణం.. ఒకప్పుడు వివాహ క్రతువులో జీలకర్ర బెల్లం.. మేళతాళాలు.. వేదపండితుల మంత్రోచ్ఛారణ.. మాంగల్యధారణ.. ఏడడుగులు.. తలంబ్రాలతో పెళ్లిపుస్తకానికి శుభం కార్డు పడేది.. ఇప్పుడు ఆధునిక హంగులతో పెళ్లితంతు కొత్తపుంతలు తొక్కుతోంది.
అంబరాన్ని తాకేలా వివాహ సంబురాలు
ఖమ్మం బల్లేపల్లి, న్యూస్టుడే
జీవితంలో కల్యాణం అనేది రెండు మనసుల మాంగల్య బంధం.. నిండు నూరేళ్లు కలిసి చేసే ప్రయాణం.. ఒకప్పుడు వివాహ క్రతువులో జీలకర్ర బెల్లం.. మేళతాళాలు.. వేదపండితుల మంత్రోచ్ఛారణ.. మాంగల్యధారణ.. ఏడడుగులు.. తలంబ్రాలతో పెళ్లిపుస్తకానికి శుభం కార్డు పడేది.. ఇప్పుడు ఆధునిక హంగులతో పెళ్లితంతు కొత్తపుంతలు తొక్కుతోంది. శుభలేఖ నుంచి అప్పగింతల వరకూ ఆకర్షణీయమైన ఏర్పాట్లకు శ్రీకారం చుడుతున్నారు. ధనం మనది కాదనుకుంటే దర్జాగా పెళ్లి సంబురాలను అంబరాన్ని తాకేలా చేసేసుకోవచ్చు. కల్యాణ మండపాల నుంచి భోజనాల వరకూ ఒకరిని మించి మరొకరు భిన్నత్వం వైపు మొగ్గు చూపుతున్నారు.
తెలుగింటి పెళ్లిళ్లలో ఉత్తరాది సంస్కృతి ఘట్టాలు ఆవిష్కృతమవుతున్నాయి. మంగళస్నానాల క్రతువును హల్దిఫంక్షన్ పేరిట శోభాయమానంగా నిర్వహిస్తున్నారు. వధూవరులతో పాటు బంధువులు, స్నేహితులు పసుపురంగు వస్త్రాలు, అలంకరణతో సందడి చేస్తున్నారు. పూలు, సుగంధ ద్రవ్యాలతో నిండిన ఇత్తడి గంగాళాలు (పాత్రలు), అరటి ఆకులు, బంతిపూల దండలతో వేదికలు ఆకట్టుకుంటున్నాయి. జోష్ పాటలతో సందడి చేస్తూ ఫొటోషూట్లో బంధించేస్తున్నారు. పెళ్లికూతురుతో పాటు ఇంటిల్లిపాది అలంకరించుకుని మెహందీ వేడుకలు జరుపుకొంటున్నారు. ఇక సంగీత్ గురించి చెప్పక్కర్లేదు. రెండువైపులా కుటుంబాలు నెలరోజుల ముందు నుంచే కొరియోగ్రాఫర్లను ఎంపిక చేసుకొని నృత్యాలు నేర్చుకుంటున్నాయి. వెలుగుజిలుగుల మధ్య పాటలకు చక్కని అభినయంతో చేసే నృత్యాలను కెమెరాల్లో నిక్షిప్తపరుస్తున్నారు. స్నేహితులతో చేసే బ్యాచిలర్ పార్టీలు దుమ్మురేపుతున్నాయి. పెళ్లి, రిసెప్షన్కు వేలాది మంది తరలివస్తుండటంతో భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.
రిటర్న్ గిఫ్ట్లు...
పేరుకే పెళ్లిభోజనం అంటారు కానీ ఎన్నో రకాల టిఫిన్లు, స్నాక్ ఐటమ్స్, బోలెడన్ని స్వీట్స్, పండ్లు, వివిధ వంటకాలకు రూ.లక్షలు వెచ్చిస్తున్నారు. వివాహానికి హాజరైన వారికి రిటర్న్గిఫ్ట్లు ఇస్తూ జ్ఞాపకాలను వీడియోలు, ఫొటోల్లో బంధిస్తున్నారు.
రవాణా సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని..
పాల్వంచకు చెందిన ఓ కుటుంబం ఇటీవల హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో అట్టహాసంగా కల్యాణం జరిపించింది. ఇల్లెందుకు చెందిన నాలుగు కుటుంబాలు ఈమధ్య ఖమ్మంలోనే ఘనంగా పెళ్లిళ్లు చేశాయి. ఖమ్మం నగరానికి చెందిన ప్రవాస భారతీయులు హైదరాబాద్లోని ఓ పెద్ద హోటల్లో వివాహ వేడుకలు నిర్వహించారు. పెళ్లికి హాజరయ్యే రెండు కుటుంబాల బంధువులు, స్నేహితులకు సౌకర్యాలు కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. పాత కాలం తరహాలో చుట్టాలు పెళ్లింటికి రెండు మూడు రోజులు సమయం కేటాయించట్లేదు.
* రవాణా సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని పెళ్లి వేడుకలకు ప్రాంతాలను ఎంపిక చేసుకుంటున్నారు. గ్రామాల్లో నివసించేవారు పట్టణాల్లో, పట్టణంలో నివసించేవారు ఖమ్మం నగరంలో, ఖమ్మం నగరంలో నివసించేవారు హైదరాబాద్లో వివాహ మహోత్సవాలు నిర్వహించటం ట్రెండుగా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?