Train Halting Stations: తెలుగు రాష్ట్రాల్లోని రైలు ప్రయాణికులకు శుభవార్త

సుదూర ప్రాంతాలకు వెళ్లే పలు ముఖ్యమైన రైళ్లను తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ముఖ్యమైన స్టేషన్లలో ఆపాలంటూ దీర్ఘకాలంగా రెండు రాష్ట్రాల ప్రజలు చేస్తున్న డిమాండ్లపై రైల్వే శాఖ సానుకూలంగా స్పందించింది.

Updated : 18 Jul 2023 17:31 IST

హైదరాబాద్‌: సుదూర ప్రాంతాలకు వెళ్లే పలు ముఖ్యమైన రైళ్లను తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ముఖ్యమైన స్టేషన్లలో ఆపాలంటూ దీర్ఘకాలంగా రెండు రాష్ట్రాల ప్రజలు చేస్తున్న డిమాండ్లపై  రైల్వే మంత్రిత్వశాఖ సానుకూలంగా స్పందించింది. తనకు వచ్చిన డిమాండ్లపై కిషన్‌రెడ్డి .. కొద్ది రోజుల కిందటే రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి ఆయా స్టేషన్లలో వివిధ ముఖ్యమైన రైళ్లను ఆపడం ద్వారా ప్రజలకు కలిగే సౌకర్యం గురించి వివరించారు.

దీనిపై అధికారులతో మాట్లాడిన రైల్వే మంత్రి.. ఈ డిమాండ్లకు అంగీకరిస్తూ ఆయా రైల్వే స్టేషన్లలో వివిధ ప్రధానమైన రైళ్లను ఆపనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. తెలంగాణలోని బెల్లంపల్లి, సిర్పూర్‌-కాగజ్‌నగర్‌, మహబూబ్‌నగర్‌, షాద్‌నగర్‌, గద్వాల్‌ రైల్వే స్టేషన్లలో, ఆంధ్రప్రదేశ్‌లోని పిడుగురాళ్ల, నడికుడి, సత్తెనపల్లి, డోర్నకల్‌, బొబ్బిలి, దువ్వాడ, పీలేరు స్టేషన్లలలో వివిధ రైళ్లను ఆపనున్నట్టు రైల్వేశాఖ వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని