AP High court: కోర్టు ఉత్తర్వులు ఇచ్చే వరకు కార్యాలయాలను విశాఖకు తరలించం: ఏపీ ప్రభుత్వం

ప్రభుత్వ కార్యాలయాలు విశాఖకు తరలింపు వ్యవహారంపై దాఖలైన వ్యా్జ్యాలను త్రిసభ్య ధర్మాసనం ముందుకు పంపుతూ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు.

Published : 21 Dec 2023 20:12 IST

అమరావతి: ప్రభుత్వ కార్యాలయాలు విశాఖకు తరలింపు వ్యవహారంపై దాఖలైన వ్యాజ్యాలను త్రిసభ్య ధర్మాసనం ముందుకు పంపుతూ హైకోర్టు సింగిల్‌ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. త్రిసభ్య ధర్మాసనం తగిన ఉత్తర్వులు ఇచ్చేంత వరకు కార్యాలయాల తరలింపునకు చర్యలు తీసుకోబోమని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. సీఎం క్యాంపు కార్యాలయం ముసుగులో ప్రభుత్వ కార్యాలయాలను అమరావతి నుంచి విశాఖకు తరలిస్తున్నారని రాజధాని రైతులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. పిటిషన్‌పై విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు