కుక్కపిల్ల మరణం.. తల్లి మూగవేదన

కళ్ల ముందే కుక్కపిల్ల మరణంతో తల్లి శునకం ఆవేదన హృదయాలను కలచివేసింది. విశాఖ జిల్లా పాడేరులో ఓ కుక్కపిల్ల వాహనం ఢీకొని మృతిచెందింది. తల్లి శునకంతో కలిసి రోడ్డు దాటుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది....

Published : 23 Apr 2021 18:55 IST

పాడేరు: కళ్ల ముందే కుక్కపిల్ల మరణంతో ఆ తల్లి శునకం ఆవేదన హృదయాలను కలచివేసింది. విశాఖ జిల్లా పాడేరులో ఓ కుక్కపిల్ల వాహనం ఢీకొని మృతిచెందింది. తల్లి శునకంతో కలిసి రోడ్డు దాటుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఏంచేయాలో తెలియక తల్లి శునకం వచ్చిపోయే వాహనాల వెంట పరుగులు పెడుతూ తల్లడిల్లిపోయింది. కుక్కపిల్ల మృతదేహం వద్దే కూర్చొని దీనంగా ఆక్రోశించింది. ఈ హృదయవిదారక దృశ్యం స్థానికుల హృదయాలను కలచివేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు