ప్రియురాలి ఇంటి నుంచి.. పాకిస్థాన్లోకి
ప్రియురాలిని కలిసేందుకు ఆమె ఇంటికి వెళ్లిన ఓ యువకుడు అక్కడి నుంచి తప్పించుకొని వచ్చే క్రమంలో పొరపాటున సరిహద్దును దాటి పాకిస్థాన్లోకి అడుగుపెట్టాడు. ఈ ఘటన గతేడాది నవంబరులో జరిగింది.
పాకిస్థాన్లో చిక్కుకున్న రాజస్థాన్ యువకుడు
సత్వరం తీసుకురావాలని కోరుతున్న బంధువులు
జైపూర్: ప్రియురాలిని కలిసేందుకు ఆమె ఇంటికి వెళ్లిన ఓ యువకుడు అక్కడి నుంచి తప్పించుకొని వచ్చే క్రమంలో పొరపాటున సరిహద్దును దాటి పాకిస్థాన్లోకి అడుగుపెట్టాడు. ఈ ఘటన గతేడాది నవంబరులో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గెమ్రా రామ్ మేఘ్వల్(19) అనే యువకుడు భారత్-పాక్ సరిహద్దుల్లో గల కుంహారో కా టిబ్బా ప్రాంతంలో నివసిస్తున్నాడు. 2020 నవంబరులో అతడు తన ప్రియురాలిని కలిసేందుకు ఆమె ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో హఠాత్తుగా ఆమె తల్లిదండ్రులు ఇంటికి తిరిగి రావడంతో అతడు అక్కడి నుంచి తప్పించుకున్నాడు. అలా పారిపోతూ పొరపాటున సరిహద్దును దాటి పాకిస్థాన్లోకి వెళ్లిపోయాడు. ఆ తర్వాత పాకిస్థాన్ అధికారులు అతణ్ని అరెస్టు చేసినట్లు రాజస్థాన్ పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో సదరు యువకుణ్ని పాకిస్థాన్లో ఎన్ని చిత్ర హింసలు పెడుతున్నారోనని అతడి కుటుంబీకులు తల్లడిల్లుతున్నారు.
గత నవంబరులో మేఘ్వల్ కన్పించడంలేదని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం అతణ్ని వీలైనంత త్వరలో భారత్కు తీసుకురావాలని కోరుతూ గురువారం స్థానిక భాజపా నాయకులతో కలిసి జిల్లా కలెక్టరును కలిశారు. సరిహద్దు భద్రతా దళానికి (బీఎస్ఎఫ్) చెందిన ఓ అధికారి ఈ కేసును పరిశీలిస్తున్నామని తెలిపారు. ‘‘పాకిస్థాన్ రేంజర్లతో అనేక సార్లు సమావేశాలు జరిగిన తర్వాత మేఘ్వల్ సింధ్ పోలీసుల అధీనంలో ఉన్నాడని వారు తెలిపారు. చట్టపరమైన చర్యలు పూర్తైన తర్వాత అతణ్ని భారత్కు అప్పగిస్తామన్నారు. అతడు భారత్కు తిరిగి వచ్చిన తర్వాతే పాకిస్థాన్లోకి ఏ విధంగా ప్రవేశించాడన్న విషయం తెలుస్తుంది.’’ అని ఆయన వెల్లడించారు.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య