విలువలే ఆస్తి.. అదేంటో తెలుసుకోండి మరి!
ఆస్తుల కోసం కుటుంబాలే చీలిపోతున్న రోజులివి. తండ్రి కుమారులు, అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు ఆస్తుల కోసం గొడవలు పడుతున్న ఈ రోజుల్లో మానవత్వం అన్న పదమే కనుమరుగైంది.
ఇంటర్నెట్ డెస్క్: ఆస్తుల కోసం కుటుంబాలే చీలిపోతున్న రోజులివి. తండ్రి కుమారులు, అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు ఆస్తుల కోసం గొడవలు పడుతున్న ఈ రోజుల్లో మానవత్వం అన్న పదమే కనుమరుగైంది. ఇలాంటి తరుణంలో తన తండ్రి తాకట్టుగా తీసుకున్న రూ.లక్షల విలువైన పొలాన్ని రైతు కుటుంబానికే ఇచ్చేశాడు ఓ వడ్డీ వ్యాపారి. మానవత్వానికి నిలువెత్తు ప్రతీకగా నిలిచాడు ఆ మధ్యప్రదేశ్ వాసి.
డబ్బే జీవితం కాదని మధ్యప్రదేశ్కు చెందిన ఓ వడ్డీ వ్యాపారి నిరూపించాడు. మధ్యప్రదేశ్లోని భీండ్ జిల్లా ఘనౌలి గ్రామానికి చెందిన హరిఓం సింగ్ భదౌరియా అనే వడ్డీ వ్యాపారి డబ్బు కంటే మానవత్వానికే అధిక ప్రాధాన్యం ఇచ్చాడు. తన తండ్రి తాకట్టుగా తీసుకున్న భూమిని పేద రైతుకు తిరిగి ఇచ్చేసి విశాల హృదయాన్ని చాటుకున్నాడు. హరిఓం సింగ్ భదౌరియా తన తండ్రి జనక్సింగ్ నుంచి వారసత్వంగా వచ్చిన వడ్డీ వ్యాపారంతో పాటు వ్యవసాయం కూడా చేస్తున్నాడు. 1970లో జనక్ సింగ్ వద్ద శరవణ్ సింగ్ అనే పేద రైతు తన వ్యవసాయ భూమిని తాకట్టు పెట్టి రూ.1300 అప్పు తీసుకున్నాడు. పేదరికం వల్ల అసలు కాదు కదా వడ్డీ కూడా చెల్లించలేకపోయాడు. కాలక్రమంలో అప్పు ఇచ్చిన జనక్సింగ్, తీసుకున్న శరవణ్ సింగ్ చనిపోయారు. శరవణ్ సింగ్కు ముగ్గురు కుమారులు కాగా వారు కూలీ పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. చాలీ చాలని ఆదాయంతో పేదరికంలో గడుపుతున్నారు. వారి పరిస్థితిని తెలుసుకొని చలించిపోయిన హరిఓం సింగ్ తన ఔదార్యం చాటుకున్నారు. 50ఏళ్ల క్రితం శరవణ్ సింగ్ తన తండ్రి వద్ద తనఖా ఉంచిన భూమిని ఒక్క పైసా తిరిగి తీసుకోకుండా ఆయన ముగ్గురు కుమారులకు తిరిగి ఇచ్చేశాడు. తానే ఖర్చులు భరించి ఆ భూమిని వారి పేర్ల మీద రిజిస్ర్టేషన్ చేయించారు. హరిఓం సింగ్ చేసిన ఈ పనికి శరవణ్ సింగ్ కుమారులు ఉప్పొంగి పోతున్నారు. తిరిగి ఇచ్చిన భూమి విలువ సుమారు రూ.20లక్షలు. శరవణ్ సింగ్ కుమారులతో పాటు దేశవ్యాప్తంగా రైతుల కష్టాలను చూసి భూమిని తిరిగి ఇచ్చినట్లు ఆయన తెలిపారు. హరిఓంసింగ్ ఔదార్యం చూసి అక్కడి గ్రామస్థులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదంతా చూశాక ఎవరైనా విలువలే ఆస్తి అనాల్సిందే మరి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..