Margadarsi: సూర్యాపేటలో మార్గదర్శి నూతన బ్రాంచ్‌ ప్రారంభం

జిల్లా కేంద్రమైన సూర్యాపేటలో మార్గదర్శి (Margadarsi) చిట్‌ఫండ్‌ నూతన బ్రాంచ్‌ ప్రారంభమైంది.

Updated : 16 Feb 2024 18:36 IST

సూర్యాపేట: జిల్లా కేంద్రమైన సూర్యాపేటలో మార్గదర్శి (Margadarsi) చిట్‌ఫండ్‌ నూతన బ్రాంచ్‌ ప్రారంభమైంది. శుక్రవారం సంస్థ ఎండీ శైలజా కిరణ్.. 113వ బ్రాంచ్‌ని ప్రారంభించారు. కార్యక్రమంలో కేంద్ర కార్యాలయం ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

జగిత్యాలలో నూతన బ్రాంచ్‌ ..

ఖాతాదారుల సేవలో మార్గదర్శి బ్రాంచ్‌ జగిత్యాల శాఖ దినదినాభివృద్ధి సాధించాలని ఈనాడు సంస్థల మేనేజింగ్​ డైరెక్టర్​ కిరణ్​ పేర్కొన్నారు. మార్గదర్శిపై ఖాతాదారుల నమ్మకమే సంస్థపై 60 ఏళ్లుగా నిబద్ధత, నిజాయతీకి దోహదపడిందని అభిప్రాయపడ్డారు. జగిత్యాల ఆర్టీసీ డిపో సమీపంలో మార్గదర్శి(Margadarsi) బ్రాంచ్‌ని మార్గదర్శి వైస్​ఛైర్మన్ ​పి.రాజాజీ లాంఛనంగా ప్రారంభించగా, ఈనాడు సంస్థల మేనేజింగ్​ డైరెక్టర్​ కిరణ్ వర్చువల్​ పద్ధతిలో శుభాకాంక్షలు తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని