ఏసీబీ కార్యాలయానికి అదనపు కలెక్టర్ తరలింపు
రైతు నుంచి భారీగా లంచం డిమాండ్ చేసి అరెస్టయిన మెదక్ అదనపు కలెక్టర్ నగేశ్ను అనిశా అధికారులు బంజారాహిల్స్లోని అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) ప్రధాన కార్యాలయానికి తరలించారు.
హైదరాబాద్: రైతు నుంచి భారీగా లంచం డిమాండ్ చేసి అరెస్టయిన మెదక్ అదనపు కలెక్టర్ నగేశ్ను అనిశా అధికారులు బంజారాహిల్స్లోని అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) ప్రధాన కార్యాలయానికి తరలించారు. మాచవరంలోని క్యాంపు కార్యాలయం నుంచి ప్రత్యేక వాహనంలో హైదరాబాద్కు తీసుకొచ్చారు. బుధవారం ఉదయం నుంచి ఆయన కార్యాలయం, ఇంట్లో సోదాలు చేసిన అధికారులు పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. కొంపల్లిలోని నగేశ్ నివాసంలో లాకర్ కీ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
భారీగా లంచం డిమాండ్ చేసిన వ్యవహారంలో నగేశ్తో పాటు ఆర్డీవో అరుణారెడ్డి, తహసీల్దార్ అబ్దుల్ సత్తార్, జూనియర్ అసిస్టెంట్ వసీమ్ అహ్మద్, నగేశ్ బినామీ జీవన్గౌడ్లను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే, నగేశ్ మినహా మిగిలిన వారందరినీ నర్సాపూర్ నుంచి అర్ధరాత్రి ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తీసుకొచ్చారు. నగేశ్ ఇంట్లో పూర్తిగా సోదాలు నిర్వహించిన అధికారులు అతన్ని ఇవాళ ఏసీబీ ప్రధాన కార్యాలయానికి తీసుకొచ్చారు. ఈ కేసులో ఇతర ఉన్నతాధికారుల పాత్రపైనా నిందితులను అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఐదుగురు నిందితులకు మరి కాసేపట్లో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం అనిశా న్యాయస్థానంలో హాజరు పర్చనున్నారు.
ఇవీ చదవండి..
రూ.1.12 కోట్ల లంచం... అడ్డంగా దొరికిన అదనపు కలెక్టర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..