మౌత్ వాష్ ఆర్డర్ చేస్తే.. ఫోన్ వచ్చింది
కొన్ని సార్లు ఆన్లైన్లో ఏవైనా వస్తువులు ఆర్డర్ చేసినపుడు అవి కాకుండా వేరే వస్తువులు రావడాన్ని మనం చూశాం. అలాగే ఫోన్, ల్యాప్టాప్లు ఆర్డర్ చేసినపుడు వాటి స్థానంలో రాళ్లు, సబ్బులు వచ్చిన ఉదంతాలు కూడా ఉన్నాయి.
ముంబయి: కొన్ని సార్లు ఆన్లైన్లో ఏవైనా వస్తువులు ఆర్డర్ చేసినపుడు అవి కాకుండా వేరే వస్తువులు రావడాన్ని మనం చూశాం. అలాగే ఫోన్, ల్యాప్టాప్లు ఆర్డర్ చేసినపుడు వాటి స్థానంలో రాళ్లు, సబ్బులు వచ్చిన ఉదంతాలు కూడా ఉన్నాయి. అలాంటి సందర్భాల్లో వినియోగదారులు సదరు సంస్థను లేదా పోలీసులను ఆశ్రయిస్తారు. తాజాగా ముంబయిలో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. కానీ ఇక్కడ వినియోగదారుడు నష్టపోవడం కాదు ప్యాకెట్లో వచ్చిన వస్తువును చూసి ఆశ్చర్యపోయాడు. అసలేం జరిగిందంటే..
ముంబయికి చెందిన లోకేశ్ అనే వ్యక్తి మే 10న మౌత్వాష్ల కోసం ఈ కామర్స్ సైట్ అమెజాన్లో ఆర్డర్ పెట్టారు. ఆర్డర్ వచ్చిన తర్వాత చూస్తే దానిలో ‘రెడ్ మీ నోట్ 10’ ఉంది. దీంతో ఆశ్చర్యపోయిన లోకేశ్ ప్యాకెట్పై వివరాలను చూస్తే తన పేరు ఉంది.. కానీ ఇన్వాయిస్ వేరే వ్యక్తిది ఉన్నట్లు గుర్తించాడు. దీంతో ఆ ఆర్డర్ను రిటర్న్ చేసేందుకు ప్రయత్నించాడు. అమెజాన్ నిబంధనల ప్రకారం మౌత్వాష్ వంటి ఉత్పత్తులను రిటర్న్ చేయడం కుదరలేదు. దీంతో లోకేశ్ అమెజాన్ ఇండియా ట్విట్టర్ ఖాతాను ట్యాగ్ చేస్తూ తనకు ఎదురైన ఇబ్బందిని వివరించాడు. ఆ స్మార్ట్ ఫోన్ అసలు ఓనర్కు పంపేలా చూడాలని కోరుతూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ వైరల్ కావడంతో దీనిపై నెటిజన్లు సరదాగా స్పందిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..