ఏపీలో ఇసుక రీచ్లపై పిటిషన్ వేశాడని కక్షసాధింపు.. అజ్ఞాతంలోకి నాగేంద్ర
రాష్ట్రంలోని అన్ని రీచ్లలో ఇసుక తవ్వకాలు ఆపాలంటూ జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఇచ్చిన ఆదేశాలు ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించాయి. దీంతో ఎన్జీటీలో పిటిషన్ వేసిన దండా నాగేంద్రపై ప్రభుత్వ శాఖల నుంచి వేధింపులు మొదలయ్యాయి.
అమరావతి: రాష్ట్రంలోని అన్ని రీచ్లలో ఇసుక తవ్వకాలు ఆపాలంటూ జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఇచ్చిన ఆదేశాలు ప్రభుత్వానికి ఆగ్రహం తెప్పించాయి. దీంతో ఎన్జీటీలో పిటిషన్ వేసిన దండా నాగేంద్రపై ప్రభుత్వ శాఖల నుంచి వేధింపులు మొదలయ్యాయి. నాగేంద్రకు పల్నాడు జిల్లా అమరావతిలో ఉన్న గెస్ట్హౌస్కు నోటీసులు జారీ అయ్యాయి. పల్నాడు జిల్లా అర్బన్ డెవలప్మెంట్ అధికారులు.. అతిథి గృహానికి నోటీసులు అంటించారు. గెస్ట్ హౌస్ అనుమతి లేకుండా నిర్మించారని నోటీసుల్లో పేర్కొన్నారు. దీనిపై వారంలోగా వివరణ ఇవ్వకపోతే అక్రమ కట్టడంగా భావించి కూల్చివేస్తామని తెలిపారు.
తాజా పర్యావరణ అనుమతులు లేకుండా.. ఇసుక తవ్వొద్దు
పోలీసు కేసులకు భయపడి దండా నాగేంద్ర ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పల్నాడు జిల్లా అమరావతికి చెందిన నాగేంద్ర ఇసుక అక్రమ తవ్వకాలపై ఎన్జీటీలో పిటిషన్ వేశారు. అందుకు కంచేటి సాయి సహకరించాడు. వీరిద్దరూ గతంలో పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకర్రావుకు అనుచరులుగా ఉండే వారు. ఎమ్మెల్యేతో విభేదాలు రావడంతో వారిని వైకాపా నుంచి బహిష్కరించారు. ఆ తర్వాత నాగేంద్ర ఎన్జీటీలో పిటిషన్ వేశారు.
కృష్ణానది గర్భంలో కిలోమీటర్ల పొడవున రహదారులు చేసి పర్యావరణ చట్టానికి తూట్లు పొడుస్తూ, భారీ యంత్రాలతో ఇసుక తవ్వుతున్నారని ఆధారాలు అందజేశారు. ఆ మేరకు రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు ఆపాలని ఎన్టీటీ ఆదేశాలు జారీ చేసింది. అప్పటి నుంచే వీరిద్దరిపై పోలీసుల వేధింపులు మొదలయ్యాయి. కంచేటి సాయిని అక్రమ మద్యం తరలిస్తున్నారని అరెస్టు చేసి జైలుకు పంపారు. అతను బెయిల్ పై బయటకు వచ్చారు. ఆ తర్వాత కంచేటి సాయిపై పీడీ చట్టం ప్రయోగించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలతో పీడీ యాక్ట్ ప్రయోగించి పొరుగు రాష్ట్రంలో ఉన్న సాయిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఈ నేపథ్యంలో దండా నాగేంద్ర అప్రమత్తమై అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెలంగాణలో పలు చోట్ల వర్షం.. పిడుగుపాటుకు ముగ్గురి మృతి
రాష్ట్రంలో పలు చోట్ల వర్షం కురుస్తోంది. వికారాబాద్ జిల్లాలోని యాలాల మండలం పరిధిలో రెండు చోట్ల పిడుగులు పడ్డాయి. -
నరసరావుపేటలో రెండో రోజు సిట్ దర్యాప్తు.. పోలీస్ స్టేషన్కు మంత్రి అంబటి
పోలింగ్ రోజు, ఆ తర్వాత చోటు చేసుకున్న హింసాత్మక దాడులు, ఘర్షణలపై పల్నాడు జిల్లాలో సిట్ దర్యాప్తు రెండో రోజు కొనసాగుతోంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో భక్తులకు చుక్కలు చూపించిన ట్రాఫిక్
ద్వాదశ జ్యోతిర్లంగ క్షేత్రమైన శ్రీశైలం ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. -
బలహీనపడిన ఆవర్తనం.. తెలంగాణలో మరో 3 రోజుల పాటు వర్షాలు
తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. -
తెలంగాణ కేబినెట్ భేటీ.. షరతులతో కూడిన అనుమతిచ్చిన ఈసీ
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహణకు ఎన్నికల సంఘం(ఈసీ) షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. -
తిరుపతి జిల్లాలో పలుచోట్ల ‘సిట్’ విచారణ.. పలు విషయాలపై ఆరా!
జిల్లాలోని చంద్రగిరి మండలం కూచువారిపల్లిలో సిట్ విచారణ చేపట్టింది. వైకాపా అభ్యర్థి మోహిత్రెడ్డి గన్మెన్ ఈశ్వర్, గ్రామస్థులను అధికారులు విచారించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ ప్రభుత్వ కక్ష సాధింపులు.. ఏబీవీకి ప్రజల నుంచి విశేష మద్దతు
గత ఐదేళ్లుగా జగన్ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలకు బలైపోయిన డీజీ ర్యాంకు సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ) (AB Venkateswara Rao)కు పౌరసమాజం నుంచి విశేష మద్దతు లభిస్తోంది -
యాదాద్రి క్షేత్రానికి పోటెత్తిన భక్తులు.. ఉచిత దర్శనానికి 3 గంటల సమయం
ఆదివారం సెలవు రోజు కావడంతో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. -
నరసరావుపేటలో ‘సిట్’ దర్యాప్తు.. హింసాత్మక ఘటనలపై ఆరా
స్థానిక ఒకటో పట్టణ పోలీసు స్టేషన్లో సిట్ బృందం దర్యాప్తు చేసింది. ఇందులో భాగంగా అల్లర్లకు సంబంధించిన వీడియోలను అధికారులు పరిశీలించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. 3కి.మీ మేర బారులు
శ్రీవారి దర్శనానికి తిరుమలలో భక్తుల రద్దీ ఆదివారం కూడా కొనసాగుతోంది. భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లు, నిండిపోయాయి. -
ఇసుకపై.. డేగకన్ను
ఇసుక తవ్వకాలపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో జిల్లాలో గనుల శాఖ అధికారులు తనిఖీలకు సిద్ధమయ్యారు. ఇన్నాళ్లు చూసీచూడనట్లు వ్యవహరించిన వారంతా గత రెండు రోజులుగా రేవులను పరిశీలించే పనిలో పడ్డారు. -
వంగిపోయారా? లొంగిపోయారా?
ఎన్నికల పోలింగ్ అనంతరం హింసాత్మక ఘటనలపై ఎన్నికల కమిషన్ తీవ్రంగా పరిగణిస్తున్న తరుణంలో ఎస్పీ సిద్ధార్ధ కౌశల్ తమ శాఖ ప్రక్షాళనపై దృష్టి సారించారు. ఎన్నికల సంఘం దృష్టి సారించక ముందే బాధ్యులపై చర్యలకు కసరత్తు ప్రారంభించారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణలో పలు చోట్ల వర్షం.. పిడుగుపాటుకు ముగ్గురి మృతి
-
నరసరావుపేటలో రెండో రోజు సిట్ దర్యాప్తు.. పోలీస్ స్టేషన్కు మంత్రి అంబటి
-
హిందీ ‘గజనీ’.. మురుగదాస్ ఫస్ట్ ఛాయిస్ సల్మాన్
-
అత్యంత పొట్టి మహిళతో ది గ్రేట్ ఖలీ.. వీడియో వైరల్
-
ధోనీ కొట్టిన ఆ భారీ సిక్సే ఆర్సీబీని గెలిపించిందా..?
-
వైకాపా ఆధ్వర్యంలో పోస్టల్ బ్యాలెట్ల తరలింపు.. కూటమి అభ్యర్థుల ఆందోళన