Srisailam: భ్రమరాంబ, మల్లికార్జునస్వామి వారిని దర్శించుకున్న నారా లోకేశ్‌

శ్రీశైల భ్రమరాంబ, మల్లికార్జున స్వామివారిని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.

Updated : 01 Feb 2024 15:02 IST

శ్రీశైలం ఆలయం: శ్రీశైల భ్రమరాంబ, మల్లికార్జున స్వామివారిని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అంతకుముందు ఆలయం వద్ద లోకేశ్‌తో పాటు ఆయన సతీమణి బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్‌కు అధికారులు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన పూజలు చేశారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అర్చకులు వారికి వేదాశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలు, జ్ఞాపిక అందజేశారు. తొలుత సాక్షి గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని