ఏ రాష్ట్రంలోనూ టీకా కొరత లేదు: కేంద్రం
దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇప్పటివరకు కొవిడ్ టీకా కొరత రాలేదని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టంచేసింది.
దిల్లీ: దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇప్పటివరకు కొవిడ్ టీకా కొరత రాలేదని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టంచేసింది. రాజస్థాన్లో టీకాల కొరత ఉందంటూ వస్తోన్న వార్తల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అన్ని రాష్ట్రాల్లో ఉన్న టీకా నిల్వలపై ప్రతిరోజూ సమీక్ష చేస్తామని, ఇప్పటివరకు అలాంటి కొరత ఏర్పడలేదని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ తెలిపారు. ‘వ్యాక్సిన్ వినియోగం, నిల్వపై ప్రతి రోజూ అన్ని రాష్ట్రాల నుంచి సమాచారం వస్తుంది. వీటిపై ఎప్పటికప్పుడు రాష్ట్రాలతో పర్యవేక్షిస్తూనే ఉంటాం. కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్లను నేరుగా పంపిణీ చేయదు. కేవలం ఆయా రాష్ట్రాల ప్రభుత్వ కేంద్రాలకు ఉచితంగా అందజేస్తాం. ప్రైవేటులో మాత్రం ధరల నియంత్రణను పర్యవేక్షించే బాధ్యత మాది’ అని ఆయన వివరించారు.
ఆయా రాష్ట్రాల అవసరాల మేరకు వ్యాక్సిన్ సరఫరా చేస్తున్నామని.. రాజస్థాన్లోనూ ఇప్పటివరకు కొరత రాలేదని స్పష్టంచేశారు. ప్రస్తుతం కొవిషీల్డ్ వ్యాక్సిన్ ధర తగ్గుతుందా అని అడిగిన ప్రశ్నకు.. వీటిపై ఇప్పటికే ఆయా సంస్థలతో సంప్రదింపులు జరిపామని రాజేష్ భూషణ్ పేర్కొన్నారు. ఒక డోసు టీకా ధరను రూ.200ల కంటే తక్కువకు వచ్చేలా సంప్రదింపులు జరిపామన్నారు. ఇదిలాఉంటే, కొవిషీల్డ్ తయారుచేస్తోన్న సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో మరో పది కోట్ల డోసుల కోసం ఒప్పందం కుదుర్చుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఇటీవల వెల్లడించింది. డోసుకు రూ.150ల చొప్పున (జీఎస్టీ కలుపుకొని) ఈ పది కోట్ల డోసులను అందించనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ సహాయమంత్రి అశ్విని చౌబే రాజ్యసభలో వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..