Video: గాయని ఊర్వశిపై కరెన్సీ నోట్ల వర్షం

జానపద గాయని ఊర్వశీ రాదాదియాపై కరెన్సీ నోట్ల వర్షం కురిసింది. ఆమె పాటలకు ఫిదా అయిన ప్రేక్షకులు రూ.లక్షల విలువ చేసే నోట్లను వెదజల్లిన వీడియోను ఆమె రీపోస్ట్‌ చేశారు.

Published : 16 Sep 2023 01:56 IST

కచ్‌: గుజరాత్‌కు చెందిన ఓ జానపద గాయనిపై కరెన్సీ నోట్ల(Currency Notes) వర్షం కురిసింది. స్టేజ్‌పై ఆమె తన బృందంతో కలిసి పాడుతున్నంతసేపూ అభిమానులు కరెన్సీ నోట్లను వెదజల్లుతూనే ఉన్నారు. దీంతో ఆ వేదిక అంతా కరెన్సీతో నిండిపోయింది. కచ్‌(Kutch)లో గోశాల పనుల కోసం నిధుల సేకరణలో భాగంగా ఏర్పాటు చేసిన  సంగీత కచేరీలో జానపద గాయని ఊర్వశీ రాధాదియా(Uravashi Radadiya) ఆహ్వానించారు. కచ్‌లో గురువారం జరిగిన ఈ సంగీత కచేరిలో ఊర్వశీ తన గాత్రంతో ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేశారు. ఆమె పాటలు పాడుతున్న క్రమంలో అభిమానులు, ప్రేక్షకులు కరెన్సీ నోట్లు వెదజల్లుతున్న వీడియో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను ఊర్వశీ రాదాదియా తన ‘ఎక్స్‌’ (ట్విటర్‌) ఖాతాలో రీపోస్ట్‌ చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని