Viveka Murder Case: రాహుల్ దేవ్ శర్మ నుంచి వివరాలు సేకరించిన సీబీఐ
వివేకా హత్య సమయంలో కడప ఎస్పీగా ఉన్న రాహుల్ దేవ్ శర్మ హైదరాబాద్లోని సీబీఐ కార్యాలయానికి వచ్చారు. కేసు వివరాలను అధికారులకు అందజేశారు.
హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన సమయంలో కడప ఎస్పీగా ఉన్న రాహుల్దేవ్ శర్మ హైదరాబాద్లోని సీబీఐ కార్యాలయంలో కేసు వివరాలు అందజేశారు. దాదాపు గంటపాటు సీబీఐ కార్యాలయంలో రాహుల్దేవ్ శర్మ ఉన్నారు. అధికారులు ఆయన్ను పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. వివేకాహత్య కేసులో గతంలో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)లోనూ రాహల్ దేవ్ సభ్యుడిగా ఉండటంతో గతంలో చోటు చేసుకున్న పరిణామాలపైనా ఆయన్ను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. హత్యాస్థలంలో లభించిన ఆధారాలను అప్పటి ఎస్పీ రాహుల్ దేవ్కు కుటుంబ సభ్యులు అందజేశారు. వాటి గురించి కూడా సీబీఐ అధికారులు ఆరా తీసినట్లు సమాచారం.
భాస్కర్రెడ్డికి 29 వరకు జ్యుడిషియల్ రిమాండ్
మరోవైపు ఈ కేసులో అరెస్టయిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్రెడ్డి, ఉదయ్కుమార్రెడ్డిల సీబీఐ కస్టడీ ఇవాళ్టితో ముగియడంతో.. వారిని అధికారులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం.. వైస్ భాస్కర్రెడ్డికి ఈ నెల 29 వరకు, ఉదయ్కుమార్ రెడ్డికి ఈ నెల 26 వరకు జ్యుడిషియలర్ రిమాండ్ విధించింది. వైద్య పరీక్షల అనంతరం తిరిగి వారిద్దరినీ చంచల్గూడ జైలుకు తరలించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తాం: నెట్వర్క్ ఆసుపత్రుల లేఖ
మే 4వ తేదీ నుంచి నగదు రహిత చికిత్సలు నిలుపుదల చేస్తామని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు ప్రభుత్వానికి లేఖ రాశాయి. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మచిలీపట్నంలో వైకాపా అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరుల వీరంగం
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైకాపా అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరులు వీరంగం సృష్టించారు. -
పింఛను దారులను అష్టకష్టాలు పెడుతున్న జగన్
తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలంలో పింఛన్ కోసం వృద్ధులు, వికలాంగులు, వితంతవులు గురువారం పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. -
4 కంటైనర్లలో రూ.2వేల కోట్లు పట్టివేత!
అనంతపురం జిల్లా పామిడి వద్ద నాలుగు కంటైనర్లలో తరలిస్తున్న కరెన్సీని పోలీసులు పట్టుకున్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీ రనౌట్.. నెట్టింట జితేశ్ శర్మపై ట్రోలింగ్
-
ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తాం: నెట్వర్క్ ఆసుపత్రుల లేఖ
-
బోయింగ్ విజిల్ బ్లోయర్ ఆకస్మిక మృతి.. 2 నెలల వ్యవధిలో రెండోది
-
‘పుష్ప2’ స్టెప్పై డేవిడ్ వార్నర్ కామెంట్.. చాలా ఈజీ అంటూ రిప్లై ఇచ్చిన బన్నీ
-
విరాట్ స్ట్రైక్రేట్ను విమర్శించే స్థాయి మీకుందా?: ఏబీ డివిలియర్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM