Vizag: అద్దె బైకులో విశాఖపట్నం చుట్టేద్దామా...
వాణిజ్యం, పర్యాటకపరంగా విశాఖపట్నం ఎంతో ప్రాధాన్యత ఉన్న నగరం. సాంస్కృతిక, చారిత్రక నిర్మాణాలకు ఈ నగరం ప్రసిద్ధి చెందింది. కుటుంబసమేతంగా సెలవులు గడిపేందుకు సరైన పర్యాటక ప్రదేశమిది.
విశాఖపట్నం: వాణిజ్యం, పర్యాటకపరంగా విశాఖపట్నం ఎంతో ప్రాధాన్యత ఉన్న నగరం. సాంస్కృతిక, చారిత్రక నిర్మాణాలకు ఈ నగరం ప్రసిద్ధి చెందింది. కుటుంబసమేతంగా సెలవులు గడిపేందుకు సరైన పర్యాటక ప్రదేశమిది. ఇక్కడి ప్రకృతి అందాలను వీక్షించేందుకు వచ్చే యాత్రికులకు రైల్వే శాఖ సరికొత్త సేవలను అందుబాటులోకి తెచ్చింది. నగర సందర్శనకు వచ్చేవారి కోసం అద్దెకు ద్విచక్ర వాహనాలు, కార్ల సదుపాయం కల్పించింది.
ప్రయాణికులను ఆకట్టుకునే క్రమంలో వాల్తేరు డివిజన్ రైల్వే అధికారులు ఇప్పటికే పలు సదుపాయాలను కల్పించారు. అయితే స్టేషన్కు చేరుకున్న యాత్రికులు.. నచ్చిన ప్రదేశాలకు వెళ్లేందుకు ఆటోలు, క్యాబ్లు, ఇతర వాహనాలను ఆశ్రయించే విధానాన్ని పరిశీలించిన అధికారులు.. తామే అద్దెకు వాహన సదుపాయం కల్పించేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు కార్యాచరణ అమలు చేశారు. విశాఖ అందాలను తిలకించేందుకు విజయవాడ, హైదరాబాద్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్ నుంచి వేల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. నగరంలోని రామకృష్ణ, రుషికొండ, యారాడ బీచ్లు, కైలాసగిరి, టీయూ-142 ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం, సబ్మెరైన్ మ్యూజియం, జూపార్క్ సహా సింహాచలం, తొట్లకుండ, బావికొండ లాంటి ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించేందుకు ఆసక్తి కనబరుస్తారు.
ఆంధ్రా ఊటీ అరకుతో పాటు లంబసింగి వంజంగి లాంటి ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లేందుకు ఇష్టపడతారు. పర్యాటకుల అవసరాలను గ్రహించిన రైల్వే శాఖ ‘మిస్టర్ బైక్స్’ పేరిట బైక్, కార్ సర్వీసులను ఏర్పాటు చేసింది. విశాఖ రైల్వే స్టేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రం వద్ద ఎలక్ట్రికల్ పెట్రోలు వాహనాలు అందుబాటులో ఉంటాయి. వాటి రకం మేరకు ధరలు నిర్ణయించారు. పెట్రోల్తో నడిచే స్కూటీ తరహా వాహనానికి రోజుకు రూ.500, బైక్లకు రూ.600-1200 అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఆధార్, ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ సమర్పించి అద్దెకు వాహనాన్ని పొందవచ్చు. నచ్చిన వాహనం కోసం వారం రోజుల ముందు ఆన్లైన్లో బుక్ చేసుకునే సదుపాయం ఉంది.
యువతకు ఈ వాహనాలు చాలా ఉపయోగపడుతున్నాయని నిర్వాహకులు చెబుతున్నారు. పర్యాటకుల కోసం రెండు వందలకుపైగా ద్విచక్ర వాహనాలు, పదుల సంఖ్యలో కార్లు అందుబాటులో ఉంచారు. వినియోగదారులకు ఇచ్చే వాహనాలకు.. ఎక్కడికైనా సులువుగా చేరుకునేందుకు వీలుగా జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థ ఉంటుంది. రైల్వే స్టేషన్ ప్రాంగణంలో ఈ సదుపాయం ఉండటం పట్ల పర్యాటకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయండి: సుప్రీంకోర్టు ఆదేశం
ఏపీలో అక్రమ ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం.. భారీగా తరలివచ్చిన భక్తులు
భక్తులంతా వేయికళ్లతో ఎదురుచూసిన సింహాద్రి అప్పన్న స్వామి నిజరూప దర్శనం సాక్షాత్కారమైంది. వైశాఖ శుద్ధ తదియ పర్వదినాన్ని పురస్కరించుకుని సింహాచలంలో చందనోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (10/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
అసెంబ్లీలో అలా తిట్టుకోవడం చూసి షాకయ్యా..: చిరంజీవి
సినీ నటుడు చిరంజీవి, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి నాటి జ్ఞాపకాలను ఒకరితో ఒకరు పంచుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
గూగుల్, యాపిల్కు పోటీగా మైక్రోసాఫ్ట్ గేమింగ్ స్టోర్
-
రోల్ మోడల్ లాంటి ఐపీఎల్లో... ఇదేం అంపైరింగ్!
-
ఖలిస్థానీ నేత అమృత్పాల్ సింగ్ నామినేషన్ దాఖలకు సహకరించాం: పంజాబ్ ప్రభుత్వం
-
వరుస నష్టాలకు బ్రేక్.. 260 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
-
గాయమా? వ్యూహమా? ధోనీ ‘9’లో రావడంపై ఫ్లెమింగ్ స్పందన ఇదీ!
-
గో డిజిట్ ఐపీఓ.. ధరల శ్రేణి, లాట్ సైజ్ వివరాలు ఇవే..