Vizag: విశాఖ రైల్వేస్టేషన్లో కుంగిన పాదచారుల వంతెన
విశాఖపట్నం రైల్వేస్టేషన్లో సోమవారం ఉదయం పాదచారుల వంతెన కుంగింది.
విశాఖపట్నం (రైల్వే): విశాఖపట్నం రైల్వేస్టేషన్లో సోమవారం ఉదయం పాదచారుల వంతెన కుంగింది. 3, 4 ప్లాట్ఫాంల నుంచి వచ్చే ప్రయాణికులు గేట్ నంబర్ 3 వైపునకు దీని మీదుగానే వెళ్తుంటారు. వంతెన వాడుకలో ఉన్నప్పటికీ కూలిపోయే స్థితికి చేరుకుంది. దీంతో ప్రయాణికులు అక్కడి నుంచి పరుగులు తీశారు. కుంగిన సమయంలో వంతెన తాకడంతో కింద ఉన్న విద్యుత్ వైర్లు తెగిపోయాయి. విషయం తెలుసుకున్న రైల్వే సిబ్బంది వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో అప్పటికే ప్లాట్ఫాంపైకి వస్తున్న వాస్కోడిగామా ఎక్స్ప్రెస్ అర్ధంతరంగా నిలిచిపోయింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.