Tamilisai Soundararajan: రాజ్భవన్లో సంక్రాంతి.. పొంగలి వండి స్వయంగా వడ్డించిన గవర్నర్
తెలంగాణ రాజ్భవన్లో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజ్భవన్లో జరిగిన సంక్రాంతి వేడుకల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పాల్గొన్నారు. సలహాదారులు, అధికారులు, ఉద్యోగులతో కలిసి సంబరాల్లో పాల్గొన్న గవర్నర్ పొంగలి వండి అందరికీ వడ్డించారు.
హైదరాబాద్: తెలంగాణ రాజ్భవన్లో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిబ్బంది, అధికారులతో కలిసి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంబరాల్లో పాల్గొని పొంగలి వండి అందరికీ వడ్డించారు. ఆరోగ్య పొంగల్, సంతోష పొంగల్, జీ20 పొంగల్ అని తమిళిసై వ్యాఖ్యానించారు. పండుగ సందర్భంగా అందరూ ఆరోగ్యంగా, సుఖ:సంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. తెలుగు రాష్ట్రాల మధ్య వందేభారత్ రైలు ప్రారంభం సంతోషకరమన్నారు. ప్రధాని మోదీ రైల్వే శాఖపై ప్రత్యేకంగా దృష్టి సారించారని అన్నారు.
వేడుకల అనంతరం తమిళిసై మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ప్రభుత్వ బిల్లులు నా వద్ద పెండింగ్లో లేవు.. పరిశీలనలో ఉన్నాయి. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. న్యాయపరమైన చిక్కులతో నియామకాలు ఆలస్యం కారాదన్నదే నా భావన. కొత్త విధానం తీసుకొచ్చినప్పుడు ఎలాంటి లోపాలు ఉండరాదు. మలక్పేట్ ఆసుపత్రిలో సిజేరియన్ శస్త్రచికిత్స చేయించుకున్న ఇద్దరు మహిళలు మరణించడం బాధాకరం. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి. ప్రతి ఆసుపత్రిలో ప్రసవ సేవలు ప్రాథమికంగా ఉండాలి. ఓ గైనకాలజిస్ట్గా నాకు ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. ఆసుపత్రిని సందర్శించాలని నేను అనుకున్నాను. అయితే, పండుగ కారణంగా వెళ్లలేకపోయా. గతంలోనూ కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయించుకున్న నలుగురు మహిళలు మరణించారు. ప్రాథమిక సేవలైన ప్రసవాలు, సిజేరియన్లకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎలాంటి ఇబ్బందులు ఉండరాదు. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదని నేను అనడం లేదు.. జనాభా నిష్పత్తికి అనుగుణంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులు మెరుగుపరచాల్సిన అవసరం ఉంది’’ అని తమిళిసై అభిప్రాయపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. -
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై ప్రజల నుంచి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఫిర్యాదులు, నివేదనలు కోరింది. -
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
సీఎం జగన్కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుందని వైఎస్ సునీత అన్నారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
హైదరాబాద్ - బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా గురువారం రాత్రి 7.30 గంటలకు సన్రైజర్స్ హైదరాబాద్, బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. -
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
సీఎం జగన్ (YS Jagan)కు మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి సతీమణి సౌభాగ్యమ్మ బహిరంగ లేఖ రాశారు. వివేకా హత్య (Viveka Murder Case)కు కారకులైన వారికి మళ్లీ ఎంపీగా అవకాశం ఇవ్వడంతో పాటు రక్షణ కల్పిస్తున్నారంటూ ఆమె నిలదీశారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం