TTD: జనవరి 2న సర్వదర్శనం టోకెన్ల జారీ పునఃప్రారంభం

తిరుమల శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీని జనవరి 2న పునఃప్రారంభించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) వెల్లడించింది. 

Published : 31 Dec 2023 19:16 IST

తిరుపతి: తిరుమల శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీని జనవరి 2న పునఃప్రారంభించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(తితిదే) వెల్లడించింది. తిరుపతిలోని కౌంటర్లలో టోకెన్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. డిసెంబర్‌ 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన సర్వదర్శనం టోకెన్లను ఇదివరకే జారీ చేశారు. ఇప్పుడు సాధారణ సర్వదర్శన టోకెన్లను జనవరి 2వ తేదీ ఉదయం 4 గంటల నుంచి జారీ చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి దర్శన స్లాట్లు కూడా ప్రారంభమవుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని