వెంకట్రామిరెడ్డిపై చర్యలు తీసుకోండి: ఎస్‌ఈసీ

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై డీజీపీ గౌతం సవాంగ్‌కి..

Updated : 23 Jan 2021 19:58 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి వ్యాఖ్యలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై డీజీపీ గౌతం సవాంగ్‌కి ఎస్‌ఈసీ లేఖ రాశారు. ప్రాణహాని కలిగిస్తానంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఉన్నాయని.. వెంటనే వెంకట్రామిరెడ్డిపై చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. అంతేకాకుండా వెంకట్రామిరెడ్డి కదలికలపై నిఘా ఉంచాలని డీజీపీని కోరారు.

ఇవీ చదవండి..

ఏపీలో ఎన్నికలపై ఉద్యోగ సంఘాల స్పందన 

ఏపీ ‘పంచాయతీ’.. నేతల మాటల యుద్ధం


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని