TS NEWS: పాఠశాలలకు సెలవులు పొడిగింపు

కరోనా నేపథ్యంలో పాఠశాలలకు వేసవి సెలవులు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 20 వరకు సెలవులు పొడిగిస్తున్నట్టు ప్రభుత్వం

Updated : 15 Jun 2021 20:24 IST

హైదరాబాద్‌: కరోనా నేపథ్యంలో పాఠశాలలకు వేసవి సెలవులు మరో ఐదు రోజులు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో పొడిగించిన వేసవి సెలవులు నేటితో ముగిశాయి. దీంతో ఈనెల 20 వరకు సెలవులు పొడిగిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టినప్పటికీ ఈనెల 19 వరకు లాక్‌డౌన్‌ అమల్లో ఉంది. సాయంత్రం 6గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6గంటల వరకు లాక్‌డౌన్‌ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. జులై 1 నుంచి ఆన్‌లైన్‌ తరగతులతో విద్యా సంవత్సరం ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని