Fish food festival: తెలంగాణ వ్యాప్తంగా 3 రోజులపాటు ‘ఫిష్ ఫుడ్ ఫెస్టివల్’: మంత్రి తలసాని
మృగశిర కార్తె సందర్భంగా జూన్ నెలలో మూడు రోజుల పాటు ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ను నిర్వహించనున్నట్లు రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. ఈ మేరకు సంబంధిత శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.
హైదరాబాద్: మృగశిర కార్తె సందర్భంగా వచ్చే నెల 8, 9, 10వ తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ‘ఫిష్ ఫుడ్ ఫెస్టివల్’ను నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. ఈ మేరకు ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహణ, ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. నిర్వహణలో భాగంగా అన్ని జిల్లా కేంద్రాల్లో అందుబాటులో ఉండాల్సిన చేప ఉత్పత్తులు, వంటకాలపై విస్తృతంగా చర్చించారు. ఫెస్టివల్ నిర్వహణకు అనువైన ప్రాంతాలు గుర్తించి ఏర్పాట్లు చేయాలని అధికారులను తలసాని ఆదేశించారు.
20 నుంచి 30 రకాల ఫిష్ వంటకాలు..
‘‘ఫిష్ ఫుడ్ ఫెస్టివల్లో చేపలు, రొయ్యలతో తయారు చేసిన ఫిష్ ప్రై, ఫిష్ కర్రీ, బిర్యానీ వంటి అన్ని రకాల వంటకాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. స్వయం ఉపాధి పొందే విధంగా చేపలతో వివిధ రకాల వంటకాల తయారీపై అన్ని జిల్లాలకు చెందిన మహిళా మత్స్యకారులకు ఉచిత శిక్షణ ఇప్పటికే ఇచ్చాం. వారి భాగస్వామ్యంతో ప్రతి జిల్లా కేంద్రంలో జరగనున్న ఫెస్టివల్లో 20 నుంచి 30 వరకు వివిధ రకాల చేప వంటకాల స్టాల్స్ ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. అదనంగా ప్రతి చోట విజయ డెయిరీ ఉత్పత్తులతో కూడిన స్టాళ్లు కూడా ఏర్పాటు చేయాలి. ఫిష్ ఫుడ్ ఫెస్టివల్ ప్రారంభానికి ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలి’’ అని అధికారులను మంత్రి ఆదేశించారు.
రాష్ట్ర పండుగను తలపించేలా ఏర్పాట్లు..
‘‘తెలంగాణ ఏర్పడిన తర్వాత మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వివరించేలా ఏర్పాట్లు చేయాలి. ఫెస్టివల్కు హాజరయ్యే వినియోగదారులకు ఆహ్లాదం పంచే విధంగా 3 రోజులపాటు సాంస్కృతిక కార్యక్రమాలనూ నిర్వహించాలి. రాష్ట్ర పండుగను తలపించేలా ఏర్పాట్లు ఉండాలి. ఇందుకోసం పశుసంవర్థక, మత్స్య, డెయిరీ అధికారులతోపాటు గోపాలమిత్రలనూ భాగస్వాములను చేయాలి. మత్స్య రంగంలో విశేష సేవలందించిన ప్రముఖులను ఈ సందర్భంగా గుర్తించి.. సన్మానించాలి’’ అని మంత్రి అధికారులను ఆదేశించారు. మత్స్య సహకార సంఘాల సొసైటీ ఛైర్మన్గా నియమితులైన పిట్టల రవీందర్ను ఈ సందర్భంగా మంత్రి సత్కరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సజ్జల భార్గవరెడ్డిపై సీఐడీ విచారణకు ఈసీ ఆదేశం
వైకాపా సోషల్మీడియా ఇన్ఛార్జి సజ్జల భార్గవరెడ్డిపై సీఐడీ విచారణకు ఎన్నికల సంఘం ఆదేశించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
భానుడి వేడి..దొరకని నాడి
లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఇంకా పట్టణ ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
సాంకేతిక జోరు.. అరచేతిలో హోరు
ర్యాలీలు, బహిరంగ సభలు, ఇంటింట ప్రచారం.. ఇదంతా ఎన్నికల ప్రచారంలో ఒక ఎత్తు. ప్రస్తుతం అభ్యర్థులు తమ ప్రచారం ఎక్కువ మందికి చేరేందుకు సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుంటున్నారు. -
జగనన్న.. భూభక్ష చట్టం
ఇసుక అక్రమంగా తవ్వారు.. మట్టినీ దోచుకున్నారు.. ప్రకృతి వనరులను ఇష్టారాజ్యంగా ధ్వంసం చేశారు. వీటన్నింటినీ ఖాళీ చేశారు. ఇప్పటికే కనిపించిన ఖాళీ జాగాలు, ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వైకాపా నేతల కన్ను ప్రజల స్థలాలపై పడింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
కోక కట్టిన మీనాక్షి.. హీటెక్కించిన దిశాపటానీ..
-
పంజాబ్ బోల్తా.. చెన్నై సూపర్ విక్టరీ
-
భారత మార్కెట్లో చాలా అవకాశాలున్నాయి: వారెన్ బఫెట్
-
మంచు కొండలు దాటించి.. గర్భిణి ప్రాణం నిలబెట్టిన ఆర్మీ
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
-
నిండు గర్భిణిపై వైకాపా నాయకుల దాడి