KTR: బడ్జెట్‌లో ఆ రెండు పథకాలకు నిధులివ్వండి: మోదీకి కేటీఆర్ ట్వీట్‌

ఇచ్చిన హామీలు నెరవేరేలా కేంద్ర బడ్జెట్‌ ఉంటుందని ఆశిస్తున్నామని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అన్నారు.

Published : 30 Jan 2022 15:45 IST

హైదరాబాద్‌: ఇచ్చిన హామీలు నెరవేరేలా కేంద్ర బడ్జెట్‌ ఉంటుందని ఆశిస్తున్నామని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణలాంటి అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాలకు కేంద్రం మద్దతివ్వాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం త్వరలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీని ఉద్దేశించి కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. ఏపీ పునర్విభజన చట్టంలోని హామీలన్నీ నెరవేర్చాలన్నారు. నీతిఆయోగ్‌ చెప్పినట్లు మిషన్‌ భగీరథ, మిషన్‌ కాకతీయకు నిధులివ్వాలని కేటీఆర్‌ కోరారు. దీంతో పాటు ప్రధాని మోదీ గతంలో ఇచ్చిన వివిధ హామీలకు సంబంధించిన ఆంగ్ల పత్రికల కథనాలను ఆయన పోస్ట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని