Amaravati Padayatra: ఒక రోజు విరామం తర్వాత ‘అమరావతి మహాపాదయాత్ర’ ప్రారంభం 

ఏపీ ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రాజధాని రైతులు, మహిళలు చేస్తున్న పాదయాత్ర ఒక రోజు

Updated : 09 Nov 2021 15:44 IST

ఇంకొల్లు: ఏపీ ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రాజధాని రైతులు, మహిళలు చేస్తున్న పాదయాత్ర ఒక రోజు విరామం తర్వాత తిరిగి ప్రారంభమైంది. న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో చేపట్టిన యాత్ర.. తొమ్మిదో రోజైన ఇవాళ ఇంకొల్లు నుంచి దుద్దుకూరు వరకు 10.5 కిలోమీటర్ల మేర సాగనుంది. జై అమరావతి అంటూ నినాదాల మధ్య పాదయాత్ర ముందుకు కదులుతోంది. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతులకు ఇంకొల్లు ప్రాంత రైతులు, స్థానికులు సంఘీభావం తెలిపారు. అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యాత్ర 45 రోజుల పాటు కొనసాగి డిసెంబర్‌ 15న తిరుమలలో ముగియనుంది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని