TS News: పార్టీ కార్యాలయాల వద్ద స్వాతంత్ర్య వేడుకలు

నగరంలోని వివిధ రాజకీయ పార్టీల కార్యాలయాల వద్ద సాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించారు.

Updated : 12 Oct 2022 14:34 IST

హైదరాబాద్‌: నగరంలోని వివిధ రాజకీయ పార్టీల కార్యాలయాల వద్ద సాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించారు. తెరాస, కాంగ్రెస్‌, భాజపా కార్యాలయాల వద్ద ఆ పార్టీ ముఖ్యనేతలు వేడుకల్లో పాల్గొన్నారు. అధికార తెరాసకు చెందిన తెలంగాణ భవన్‌ వద్ద ఆ పార్టీ సెక్రటరీ జనరల్‌ కె.కేశవరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి హుజూరాబాద్‌ తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌, పార్టీ నేతలు హాజరయ్యారు.

కాంగ్రెస్‌ కార్యాలయం గాంధీభవన్‌ వద్ద టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 75వ స్వాతంత్ర్య వేడుకలు జరుపుకొంటున్నామంటే కాంగ్రెస్‌ నేతల త్యాగాలే కారణమని చెప్పారు. ఎంతో మంది అమరులు తమ ప్రాణాలను బలి ఇచ్చి దేశానికి స్వాతంత్ర్యం తెచ్చారన్నారు. భాజపా కార్యాలయం వద్ద ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని