CBI-ED: జగతి పబ్లికేషన్స్ కేసులో దర్యాప్తు పూర్తయింది: ఈడీ
జగతి పబ్లికేషన్స్లో పెట్టుబడుల కేసులో దర్యాప్తు పూర్తయిందని సీబీఐ కోర్టుకు ఎన్ఫోర్స్మెంట్ డైరేక్టరేట్ (ఈడీ) తెలిపింది. జగన్, విజయసాయిరెడ్డి, జగతి
హైదరాబాద్: జగతి పబ్లికేషన్స్లో పెట్టుబడుల కేసులో దర్యాప్తు పూర్తయిందని సీబీఐ కోర్టుకు ఎన్ఫోర్స్మెంట్ డైరేక్టరేట్ (ఈడీ) తెలిపింది. జగన్, విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్ ప్రమేయంపై దర్యాప్తు పూర్తయిందని పేర్కొంటూ సీబీఐ కోర్టులో ఈడీ మెమో దాఖలు చేసింది. అభియోగాల నమోదు, డిశ్ఛార్జి పిటిషన్లపై వాదనలు వినిపించాలని జగన్, విజయసాయిరెడ్డి, జగతి పబ్లికేషన్స్ను సీబీఐ కోర్టు ఆదేశించింది. వాదనలు వినిపించేందుకు ఇదే చివరి అవకాశమని న్యాయస్థానం స్పష్టం చేసింది. జగన్, విజయసాయిరెడ్డి డిశ్ఛార్జి పిటిషన్లపై కౌంటర్లు దాఖలు చేసేందుకు సీబీఐ మరోసారి గడువు కోరింది. శామ్యూల్ డిశ్ఛార్జి పిటిషన్పై వాదనల కోసం ఇండియా సిమెంట్స్ కేసును అక్టోబరు 1కి, రాజగోపాల్ డిశ్ఛార్జి పిటిషన్పై వాదనల కోసం రఘురాం సిమెంట్స్ కేసు అక్టోబరు 4కి వాయిదా పడింది. ఎమ్మార్ కేసులో కోనేరు మధు ప్రమేయంపై సమాచారం కోరుతూ విదేశాలకు పంపించిన ఎల్ఓఆర్లు ఏ స్థాయిలో ఉన్నాయో తెలపాలని సీబీఐని కోర్టు ఆదేశించింది. ఎమ్మార్ కేసులో తదుపరి దర్యాప్తుపై వివరాలు తెలిపేందుకు రెండు వారాలు గడువు కావాలని ఈడీ కోరింది. ఎమ్మార్ ఈడీ కేసును అక్టోబరు 12కి, సీబీఐ కేసును అక్టోబరు 4కి వాయిదా వేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
భానుడి వేడి..దొరకని నాడి
లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఇంకా పట్టణ ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
సాంకేతిక జోరు.. అరచేతిలో హోరు
ర్యాలీలు, బహిరంగ సభలు, ఇంటింట ప్రచారం.. ఇదంతా ఎన్నికల ప్రచారంలో ఒక ఎత్తు. ప్రస్తుతం అభ్యర్థులు తమ ప్రచారం ఎక్కువ మందికి చేరేందుకు సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుంటున్నారు. -
జగనన్న.. భూభక్ష చట్టం
ఇసుక అక్రమంగా తవ్వారు.. మట్టినీ దోచుకున్నారు.. ప్రకృతి వనరులను ఇష్టారాజ్యంగా ధ్వంసం చేశారు. వీటన్నింటినీ ఖాళీ చేశారు. ఇప్పటికే కనిపించిన ఖాళీ జాగాలు, ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వైకాపా నేతల కన్ను ప్రజల స్థలాలపై పడింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్కు తప్పని బాడీ షేమింగ్
-
దండంతో సరి.. హామీలు మరిచారేం మరి
-
నిజం చెప్పటమే నేరమా..?572 మంది ఉపాధ్యాయులకు నోటీసులు
-
బ్రెజిల్ను ముంచెత్తిన వరదలు.. 60 మంది మృత్యువాత
-
మీరూ వద్దు మీ డబ్బూ వద్దు.. వైకాపా తాయిలాలకు తలవంచని ఓటర్లు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM