అశోక్‌గజపతిరాజును కలిసిన కళాశాల ఉద్యోగులు

జీతాలు చెల్లించాలంటూ మాన్సాస్‌ కార్యాలయాన్ని ట్రస్టు కళాశాలల ఉద్యోగులు శనివారం ముట్టడించి ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఈ నెల 13లోగా సమస్యలు

Updated : 17 Jul 2021 20:47 IST

విజయనగరం: జీతాలు చెల్లించాలంటూ మాన్సాస్‌ కార్యాలయాన్ని ట్రస్టు కళాశాలల ఉద్యోగులు శనివారం ముట్టడించి ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఈ నెల 13లోగా సమస్యలు పరిష్కరిస్తామని ట్రస్టు ఈవో హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించిన కళాశాల ఉద్యోగులు ట్రస్టు ఛైర్మన్‌ అశోక్‌గజపతిరాజును కలిశారు. అన్యాయంగా జీతాలు నిలిపివేశారని ఆయన వద్ద వాపోయారు. మాన్సాస్‌ ట్రస్టు ఈవో పొంతనలేని జవాబిస్తున్నారని.. చొరవ తీసుకొని జీతాల సమస్య పరిష్కరించాలని అశోక్‌గజపతిరాజుకు ఉద్యోగులు విజ్ఞప్తి చేశారు.

అశోక్‌గజపతిరాజు మాట్లాడుతూ.. ఉద్యోగుల పట్ల ట్రస్టు ఈవో వెంకటేశ్వరరావు తీరు సరిగా లేదన్నారు. ట్రస్టులో నిధులున్నా ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోవడంపై అనుమానం వ్యక్తం చేశారు. కరోనా వేళ కూడా మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ట్రస్టు ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన తనను కలిసేందుకు ఈవోకు తీరిక దొరకడం లేదంటూ ఎద్దేవా చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని