TS News: సింగరేణిలో మోగిన సమ్మె సైరన్‌

సింగరేణిలో సమ్మె సైరన్‌ మోగింది. సింగరేణిలోని నాలుగు బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్‌) సింగరేణి

Updated : 25 Nov 2021 20:06 IST

హైదరాబాద్‌: సింగరేణిలో సమ్మె సైరన్‌ మోగింది. సింగరేణిలోని నాలుగు బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్‌) సింగరేణి యాజమాన్యానికి గురువారం నోటీసు ఇచ్చింది. డిసెంబరు 9 నుంచి సమ్మె చేయాలని నిర్ణయించినట్టు కార్మిక సంఘం నేతలు తెలిపారు.  కోల్‌ ఇండియాలోని 89 బ్లాకులతో పాటు సింగరేణిలోని నాలుగు బ్లాకుల ప్రైవేటీకరణపై కార్మిక సంఘాలు అసంతృప్తితో ఉన్నాయి. ప్రైవేటీకరణతో వారసత్వ ఉద్యోగాల్లో కోత, అర్జిత లాభాలు కనుమరుగవుతాయని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యైటింక్లైన్‌ కాలనీలో జరిగిన కేంద్ర కమిటీ సమావేశంలో కార్మికులు పలు నిర్ణయాలు తీసుకుున్నారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం అధ్యక్షుడు వెంకటరావు, మిర్యాల రాజిరెడ్డి, కెంగర్ల మల్లయ్య, ఆదిలాబాద్‌, పెద్దపల్లి, భూపాలపల్లి తదితర జిల్లా కార్మిక సంఘాల నాయకులు సమావేశంలో పాల్గొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని