Andhra news: తెదేపా నేతను కారుతో ఢీ కొట్టిన యువకుడు

తెదేపా నేత కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డిని నాగవెంకట రాజశేఖర్‌రెడ్డి అనే యువకుడు కారుతో ఢీ కొట్టాడు. నెల్లూరులోని తన ఇంటి వద్దే జరిగిన ఈ ఘటనలో.. కోటంరెడ్డికి గాయాలయ్యాయి. 

Published : 26 Nov 2022 21:30 IST

నెల్లూరు: తెదేపా నేత కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డిని నాగవెంకట రాజశేఖర్‌రెడ్డి అనే యువకుడు కారుతో ఢీ కొట్టాడు. నెల్లూరులోని తన ఇంటి వద్దే జరిగిన ఈ ఘటనలో.. కోటంరెడ్డికి గాయాలయ్యాయి. అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. తొలుత ఇంట్లోకి వచ్చిన రాజశేఖర్‌రెడ్డి తన స్నేహితుడైన కోటంరెడ్డి కుమారుడితో గొడవకు దిగాడు. ఈ క్రమంలో శ్రీనివాసులరెడ్డి, అతడిని హెచ్చరించి బయటకు పంపేశాడు. అనంతరం ఇంటి బయట ఉన్న శ్రీనివాసులరెడ్డిని కారుతో వచ్చి ఢీకొట్టి పారిపోయాడు. గాయాలపాలైన కోటంరెడ్డిని కుటుంబ సభ్యులు అపోలో ఆస్పత్రిలో చేర్పించారు.

దాదాపు రెండేళ్ల తర్వాత రాజశేఖర్‌రెడ్డి తమ ఇంటికొచ్చి గొడవకు దిగడంపై కోటంరెడ్డి కుటుంబీకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నిందితుడి కారు వెనుక వేరే కారు కూడా ఉందని, పక్కా ప్రణాళిక ప్రకారమే దాడి జరిగిందని ఆరోపిస్తున్నారు. అయితే, కోటంరెడ్డి కుమారుడికి, రాజశేఖర్‌రెడ్డికి మధ్య గొడవకు సంబంధించిన కారణాలు మాత్రం స్పష్టంగా తెలియడం లేదు. మరోవైపు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కోటం రెడ్డిని తెదేపా అధినేత చంద్రబాబు ఫోన్‌లో పరామర్శించారు. ఘటనకు గల కారణాలను ఆయన కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కోటంరెడ్డి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మాజీ మంత్రి సోమినేని చంద్రమోహన్‌ రెడ్డి ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని