Mothers: అమ్మలూ ఈ జాగ్రత్తలు తీసుకోండి!
అమ్మ అయ్యారంటే చాలు బాధ్యతలు, పిల్లల బాగోగులు చూసుకోవటం, వాళ్ల భవిష్యత్తు ప్రణాళికను వేయడం వంటి పనులకే తల్లులు అంకితం అవ్వాల్సి ఉంటుంది.
ఇంటర్నెట్ డెస్క్: అమ్మ అయితే చాలు బాధ్యతలు, పిల్లల బాగోగులు చూసుకోవడం, వాళ్ల భవిష్యత్తు ప్రణాళికలను వేయడం వంటి పనులకే తల్లులు అంకితమవ్వాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా మహిళలు తమకంటూ ఒక జీవితం ఉందనే విషయాన్నే మర్చిపోతారు. కానీ అమ్మతనాన్ని ఎంజాయ్ చేస్తూనే మీకంటూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోండిలా!
- అమ్మ కాగానే రోజూవారి పనితీరుతో పాటు శరీరంలో కూడా మార్పులు వస్తాయి. పిల్లల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో.. మీ ఆరోగ్య విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉండండి. రోజూ వ్యాయామం చేయండి. శరీరాన్ని ఎప్పుడూ ఫిట్ గా ఉంచుకునేందుకు ప్రయత్నించండి.
- అన్నింటిలో పర్ఫెక్ట్గా ఉండాలని ప్రయత్నించకండి. మీకు సాధ్యపడే పనులు మాత్రమే చేయండి. పిల్లలకు అవసరమయ్యే అన్నింటినీ అందించాలని పరుగులు తీయకండి. ఈ పరుగులో మిమ్మల్ని మీరు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. పిల్లల్ని మీ స్థాయిలోనే పెంచండి.
- పిల్లలతో కఠినంగా ఉండటం కంటే ప్రేమగా ఉండటమే ఉత్తమం. దీంతో పిల్లలు మీకు ఎక్కువగా దగ్గరవుతారు. మీ పిల్లలతో పాటు మీరు కూడా ఆడండి. వాళ్లతో కలిసి వివిధ రకాల యాక్టివిటీలు చేయండి.
- కుటుంబ బాధ్యత మొత్తం మీ మీదే ఉంటుంది. కాబట్టి అందరి మీద దృష్టి నిలపండి. మీ పిల్లలు చెప్పే మాటలను వినండి. ఏదైనా పనిలో ఉండి, ఫోన్ చూస్తూ పిల్లలు చెప్పేది వినకుంటే వాళ్లు నిరాశ చెందుతారు. అందుకే పిల్లలు మీకు ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు వారి మాటలు వినండి. దీంతో వాళ్ల ఆలోచనలు ఎలా ఉంటున్నాయో కూడా మీకు తెలిసే అవకాశం ఉంటుంది.
- పిల్లలతో వెకేషన్కు వేళ్లేందుకు ప్లాన్ చేయండి. ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారో వాళ్ల అభిప్రాయం కూడా తీసుకోండి.
- కొంతమంది తల్లులు ఎప్పుడూ సీరియళ్లు, ఫోన్లు చూస్తూ ఉంటారు. ఈ ప్రవర్తన పిల్లల మీద ప్రభావం చూపిస్తుంది. మీలాగే మీ పిల్లలు కూడా ఫోన్లకు బానిసలవుతారు. ఇది ఎంత మాత్రం మంచిది కాదు. పిల్లలకు మీరు ఓ స్ఫూర్తిప్రదాతలా ఉండాలి. మీ ప్రవర్తన తీరు చూస్తూనే వాళ్లు పెరుగుతారు కాబట్టి మరింత జాగ్రత్తగా నడుచుకోవాల్సిన అవసరం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?