Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్ చేయండి.
1.తెరాస కనుసన్నల్లోనే ఎన్నికల ప్రక్రియ: రేవంత్రెడ్డి
తెలంగాణ శాసనమండలి తెరాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై కాంగ్రెస్ నేతలు అసెంబ్లీలో మండలి రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. వెంకట్రామిరెడ్డిపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన ఐఏఎస్గా ఉన్నప్పుడు అక్రమాలు చేశారని కాంగ్రెస్ నేతలు రిటర్నింగ్ అధికారికి వివరించారు. అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మీడియాతో మాట్లాడారు.
2.కొనసాగుతున్న ‘పుర’ ఓట్ల కౌంటింగ్
ఏపీలో పుర ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం.. కడప జిల్లా రాజంపేట పురపాలిక, కర్నూలు జిల్లా బేతంచర్ల, కడప జిల్లా కమలాపురం, గుంటూరు జిల్లా దాచేపల్లి, గురజాల నగర పంచాయతీలను వైకాపా కైవసం చేసుకుంది. ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీలో తెదేపా విజయం సాధించింది.
లైవ్బ్లాగ్ కోసం క్లిక్ చేయండి
3.తెరాస ప్రతిపాదనలతోనే అంతర్జాతీయ అవార్డులు: శ్రీనివాస్గౌడ్
ఎంతో చరిత్ర ఉన్న రామప్ప ఆలయానికి తెరాస హయాంలోనే యునెస్కో గుర్తింపు వచ్చిందని పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. భూదాన్ పోచంపల్లికీ రాష్ట్ర ప్రభుత్వ కృషి వల్లే ఐరాస అవార్డు దక్కిందని చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని భూదాన్ పోచంపల్లిని ఐరాస ప్రపంచ పర్యాటక సంస్థ (యూఎన్డబ్ల్యూటీవో) ఉత్తమ పర్యాటక గ్రామంగా నిన్న ఎంపిక చేసిన నేపథ్యంలో మంత్రి హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు.
4.గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు అస్వస్థత
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు తరలించారు. దిల్లీ పర్యటన ముగించుకొని విజయవాడ చేరుకున్న ఆయన రెండు రోజులుగా దగ్గు, జలుబుతో ఇబ్బంది పడుతున్నారు. ముందు జాగ్రత్త చర్యగా ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయించారు.
5.17వ రోజుకు చేరిన అమరావతి ‘మహాపాదయాత్ర’
న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో రాజధాని రైతులు, మహిళలు చేపట్టిన మహాపాదయాత్ర 17వ రోజుకు చేరుకుంది. ఏపీ ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రైతులు చేస్తున్న యాత్ర ఇవాళ ప్రకాశం జిల్లా కందుకూరులోని వెంగమాంబ కల్యాణ మండపం నుంచి ప్రారంభమైంది.
6.కొత్తగా 10 వేలకుపైగా కేసులు.. సగానికిపైగా ఆ రాష్ట్రం నుంచే..
దేశంలో ప్రస్తుతం కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. స్వల్ప హెచ్చుతగ్గులతో రోజువారీ కేసులు వెలుగుచూస్తున్నాయి. ముందురోజు 10 వేల దిగువన నమోదైన కొత్త కేసులు.. తాజాగా 15 శాతం మేర పెరిగాయి. మంగళవారం 12,42,177 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 10,197 మందికి వైరస్ పాజిటివ్గా తేలింది.
7.పాకిస్థాన్.. పీవోకేను ముందు ఖాళీ చెయ్యి..!
ఐరాస భద్రతా మండలిలో భారత్ మరోసారి పాకిస్థాన్ వాదనను తిప్పికొట్టింది. కశ్మీర్ విషయంపై భారత ప్రతినిధి మాట్లాడుతూ.. తొలుత పాక్ దళాలు ఆక్రమిత కశ్మీర్ను ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు. ‘‘పాక్ చేసిన హాస్యాస్పద ఆరోపణలపై స్పందించేందుకు మరోసారి మీ ముందుకు రావాల్సి వచ్చింది. నేను ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పదలుచుకొన్నాను.
8.నిన్న విలియమ్సన్.. నేడు జేమీసన్.. టీ20 సిరీస్కు దూరం
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగనున్న టీ20 సిరీస్కు మరో కివీస్ ఆటగాడు దూరమయ్యాడు. నవంబర్ 25 నుంచి ప్రారంభం కానున్న టెస్టు సిరీస్ దృష్ట్యా కివీస్ బౌలర్ కౌల్ జేమీసన్కు కూడా టీ20 సిరీస్ నుంచి విశ్రాంతి కల్పించారు. ఇంతకు ముందే, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ కూడా ఇదే కారణంతో టీ20 సిరీస్కు దూరమైన విషయం తెలిసిందే.
9.నాకు సొంత ఇల్లు లేదు.. ఆ డబ్బునే పునీత్ కోసం వాడతా: విశాల్
ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 16 సంవత్సరాలైనప్పటికీ తనకు సొంత ఇల్లు లేదని నటుడు విశాల్ అన్నారు. కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన పునీత్ సంస్మరణ సభలో దక్షిణాది సినీ పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు పాల్గొన్నారు. పునీత్తో తమకున్న అనుబంధాన్ని నెమరువేసుకొని.. ఆయన చేసిన మంచి పనులను గుర్తు చేసుకున్నారు.
10.చిన్న మదుపర్లకు రక్షణగా ఐపీఓలపై సెబీ నిబంధనలు!
న్న మదుపర్ల రక్షణార్థం ఐపీఓలపై మార్కెట్ నియంత్రణా సంస్థ సెబీ కొన్ని నిబంధనలు ప్రతిపాదించింది. ముఖ్యంగా పబ్లిక్ ఇష్యూ ద్వారా సమీకరించిన నిధుల వినియోగంలో జవాబుదారీతనం, పారదర్శకతను తీసుకొచ్చే దిశగా చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది. అలాగే యాంకర్ ఇన్వెస్టర్లపైనా కొన్ని షరతులు విధించాలని భావిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?