SC Railway: రైల్వే శాఖ అప్రమత్తం.. భారీ వర్షాల కారణంగా పలు రైళ్లు రద్దు
భారీ వర్షాల కారణంగా పలు రైళ్లు రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. రేపటి నుంచి ఈనెల 17వరకు సికింద్రాబాద్- ఉందానగర్-సికింద్రాబాద్ ప్యాసింజర్ రైలు, సికింద్రాబాద్...
హైదరాబాద్: భారీ వర్షాల కారణంగా పలు రైళ్లు రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. రేపటి నుంచి ఈనెల 17వరకు సికింద్రాబాద్- ఉందానగర్-సికింద్రాబాద్ ప్యాసింజర్ రైలు, సికింద్రాబాద్-ఉందానగర్ మెము రైలు, మేడ్చల్-ఉందానగర్ మెము ప్రత్యేక రైలు, ఉందానగర్-సికింద్రాబాద్ మెము స్పెషల్ రైలు, సికింద్రాబాద్- ఉందానగర్ మెము స్పెషల్ రైలు, హెచ్.ఎస్ నాందేడ్- మేడ్చల్-హెచ్ఎస్ నాందేడ్, సికింద్రాబాద్- మేడ్చల్ మెము రైలు, మేడ్చల్-సికింద్రాబాద్ మెము రైలు, కాకినాడ పోర్టు-విశాఖపట్నం మెము రైలు, విజయవాడ- బిట్రగుంట మెము రైలును రద్దు చేసినట్టు దక్షిణ మద్య రైల్వే పేర్కొంది.
34 ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు..
వర్షాల కారణంగా ఈనెల 14 నుంచి 17 వరకు 34 ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు చేసినట్టు రైల్వే అధికారులు తెలిపారు. లింగంపల్లి-హైదరాబాద్ రూట్లో 9 సర్వీసులు, హైదరాబాగ్-లింగంపల్లి మార్గంలో 9, ఫలక్నుమా-లింగంపల్లి మధ్య 7 సర్వీసులు, లింగంపల్లి -ఫలక్నుమా రూట్లో 7 సర్వీసులు, సికింద్రాబాద్-లింగంపల్లి రూట్లో ఒకటి, లింగంపల్లి సికింద్రాబాద్ మార్గంలో ఒక సర్వీసు రద్దు చేశారు. ఉందానగర్- మేడ్చల్ మెము స్పెషల్, సికింద్రాబాద్-బొల్లారం మెము స్పెషల్, బొల్లారం-సికింద్రాబాద్ మెము స్పెషల్, మేడ్చల్-సికింద్రాబాద్ మెము స్పెషల్, సికింద్రాబాద్-మేడ్చల్ మెము స్పెషల్ రైళ్లను ఈనెల 14 నుంచి 17వ తేదీ వరకు రద్దు చేసినట్లు రైల్వే శాఖ తెలిపింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విజయవాడలో ప్రధాని రోడ్షో నేడు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాన మంత్రి మోదీ.. బుధవారం విజయవాడ నగరంలో కూటమి ఆధ్వర్యంలో నిర్వహించనున్న రోడ్షోలో పాల్గొననున్నారు. ప్రధానితోపాటు తెదేపా, జనసేన అగ్రనేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్లు కూడా హాజరవుతారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.