కొవిడ్ మృతుల స్మృత్యర్థం ఉద్యానవనం!
ఈ ఏడాది మార్చ్15 నుంచి జూన్ 15 వరకు, 90 రోజుల్లో చనిపోయిన దాదాపు ఆరువేల మంది కొవిడ్ రోగులకు భోపాల్లోని భాద్భద విశ్రామ్ ఘాట్లో దహన సంస్కారాలు నిర్వహించింది శ్మశానవాటిక సిబ్బంది.
భోపాల్: కొవిడ్ సెకండ్వేవ్ ఎంతోమంది ప్రాణాలను బలితీసుకుంది. ప్రధాన నగరాల్లో ఏ శశ్మానానికి వెళ్లినా కాలుతున్న శవాలే దర్శనమిచ్చేవి. అలా భోపాల్లోని భద్భదా విశ్రామ్ ఘాట్లో వందల సంఖ్యలో శవాలను దహన సంస్కారం చేశారు. కొంతమంది మృతుల బంధువులు వచ్చి అస్థికలు తీసుకెళ్లగా, కొవిడ్ ఆంక్షల వల్ల రాకపోకలు బంద్ అవడంతో తీసుకోకుండా మిగిలినపోయిన అస్థికలు 21 ట్రక్కుల చితాభస్మం అక్కడే మిగిలిపోయింది. దాన్ని ఏం చేయాలో అక్కడి సిబ్బందికితోచలేదు. సమీపంలోని నర్మద నదిలో పారబోయడం భావ్యం కాదని భావించి స్మృతి వనాన్ని నిర్మించాలనుకున్నారు. దీంతో శ్మశానవాటికలోనే 12వేల చదరపు అడుగులతో ఓ పార్కును ఏర్పాటు చేయాలని నిర్ణయించామని అంత్యక్రియల నిర్వహణ కమిటీ సభ్యులు మమతేశ్ శర్మ చెప్పారు. ఆ కమిటీ ప్రెసిడెంట్ అరుణ్ చౌదరి మాట్లాడుతూ, ‘‘శ్మశానవాటిక ఆవరణలోనే ఒక ఉద్యానవనాన్ని ఏర్పాటు చేయడం ద్వారా మృతుల జ్ఞాపకాలను సజీవంగా ఉంచాలనుకున్నాం. మృతుల కుటుంబ సభ్యులను కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవాలని కోరాం’’ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రచార జోరు.. వ్యూహాలకు పదును
ఎన్నికల కోడ్ కూసింది మొదలు ఖమ్మం, మహబూబాబాద్ లోక్సభ స్థానాల్లో అగ్రనేతల సమావేశాలు, సభలతో పట్టణాలకే పరిమితమైన ప్రచారం -
ఓట్ల పండగకు ఆహ్వానం
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఓటరు చైతన్యంపై సామాజిక మాధ్యమాల్లో వినూత్న సందేశాలు చక్కర్లు కొడుతున్నాయి. -
ఐఎఫ్ఎస్లో మెరిసిన పల్లె బిడ్డలు
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మారుమూల పల్లెలకు చెందిన ఇద్దరు యువకులు ఐఎఫ్ఎస్ సాధించారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (09/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఊయల కట్టిన స్టూల్ మీదపడి చిన్నారి మృతి
-
పోలింగ్ బూత్ నుంచి ఇన్స్టా లైవ్.. బోగస్ ఓటింగ్కు పాల్పడ్డాడంటూ అరెస్టు చేసిన పోలీసులు
-
24 గంటల్లో 70 వేల మెట్లు ఎక్కి హిమ్మత్సింగ్ ప్రపంచ రికార్డు!
-
8.5 అడుగుల బాహుబలి జోళ్లు కుట్టిన జోధ్పుర్ తల్లీకొడుకులు
-
ఆయన బతికే ఉన్నారు.. సుదీర్ఘ కాలం తర్వాత కనిపించిన చైనా జనరల్ వే ఫంగ్హా
-
ప్రచార జోరు.. వ్యూహాలకు పదును