వాతావరణ మార్పులపై VIT-AP అంతర్జాతీయ సదస్సు
వీఐటీ -ఏపీ స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్, హ్యుమానిటీస్, వి.ఐ.టి.-ఏ.పి. విశ్వవిద్యాలయం, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ ఛేంజ్ (SICOM) మరియు జియో క్లైమేట్ రిస్క్
అమరావతి: వీఐటీ -ఏపీ స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్, హ్యుమానిటీస్, వీఐటీ-ఏపీ విశ్వవిద్యాలయం, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ ఛేంజ్ (SICOM), జియో క్లైమేట్ రిస్క్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (GCRS)ల విజ్ఞాన భాగస్వామ్యంతో ‘వాతావరణ సంక్షోభం, భవిష్యత్తు ప్రభావాలపై రెండు రోజుల అంతర్జాతీయ సదస్సు’ జరిగింది. మే 8, 9వ తేదీల్లో వర్చువల్గా ఈ సదస్సును నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి సంజయ్ జల్లా (మిషన్ హెడ్, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ ఛేంజ్ (SICOM) హాజరై మాట్లాడారు. వాతావరణ సంక్షోభం ఏర్పడకుండా బాధ్యతాయుతంగా వనరుల ఉత్పత్తి, వినియోగం ఉండాలని కోరారు. అంతర్జాతీయ, జాతీయ విద్యావేత్తలు, విధాన నిర్ణేతలు, నిపుణులు వాతావరణాన్ని కేంద్రంగా సమాజానికి అనుసరణ విధానాలు, ఆర్థిక, చట్టపరమైన వ్యూహాలు, మౌలిక సదుపాయాలపై సదస్సులో చర్చించారు.
అనంతరం వీఐటీ-ఏపీ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ డాక్టర్.ఎస్.వి.కోటారెడ్డి మాట్లాడారు. వాతావరణ మార్పులపై పరిశోధనా పత్రాలను సమర్పిస్తున్న వారికి స్వాగతం పలికి, అభినందనలు తెలిపారు. వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా చురుకైన చర్యలు తీసుకోవాల్సిన ప్రాముఖ్యతను తెలియజెప్పారు. క్యాంపస్లో సోలార్ పీవీ ప్యానెళ్లను అమర్చడం ద్వారా అంతర్గత ఇంధన వినియోగాన్ని తగ్గించడమే వీఐటీ-ఏపీ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. యునైటెడ్ స్టేట్స్, మిడిల్ ఈస్ట్ నుంచి ఆహ్వానించిన అంతర్జాతీయ వక్తలు వాతావరణ మార్పు సమస్యలపై తమ దృక్పథాన్ని తెలియచేశారు.
టెక్సాస్ ఏ అండ్ ఎం యూనివర్శిటీకి చెందిన డా.దేబ్జానీ ఘటక్ ఉష్ణ తరంగాలు, భారతీయ పర్యావరణ సమస్యలపై తన పరిశోధనను పంచుకున్నారు. అబుదాబిలోని స్విస్ బిజినెస్ కౌన్సిల్ నుంచి పాల్గొన్న మాటియో బొఫ్పా విజయవంతమైన, స్థిరమైన వ్యాపారాన్ని నిర్వహించే ఆశాజనక అవకాశాలపై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో డా.రజనీష్ మిశ్రా, (డీన్, వీఐటీ-ఏపీ స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ అండ్ హ్యుమానిటీస్) డా.సుస్మిత శ్యాంసుందర్ (అసోసియేట్ డీన్, విష్) డా.తానియా చక్రవర్తి, డా.అరెకల కిచ్చు, డా.ప్రియాంక ఘోష్, కనక హిమబిందు పొట్టుముత్తు, విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..