Tirumala: తిరుమల శ్రీవారి సేవలో ఉపరాష్ట్రపతి వెంకయ్య

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు దర్శించుకున్నారు. కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి వైకుంఠం క్యూకాంప్లెక్స్ ద్వారా

Updated : 10 Feb 2022 16:17 IST

తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు దర్శించుకున్నారు. కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి వైకుంఠం క్యూకాంప్లెక్స్ ద్వారా మహాద్వారం వద్దకు చేరుకున్న ఆయనకు తితిదే చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో జ‌వ‌హ‌ర్‌రెడ్డి స్వాగతం ప‌లికారు. స్వామివారి సన్నిధికి చేరుకున్న ఉపరాష్ట్రపతి.. మూలమూర్తిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. రంగనాయకుల మండపంలో వేదపండితులు ఆయనకు ఆశీర్వచనం చేశారు. శ్రీవారి తీర్థప్రసాదాలు, తితిదే ముద్రించిన క్యాలెండర్‌, డైరీని తితిదే అధికారులు వెంకయ్యకు అంద‌జేశారు.

తితిదే నూతనంగా ప్రారంభించిన శ్రీవారి సేవలకు వినియోగించిన పుష్పాలను వినియోగించి లామినేటెడ్ ఫోటోలు, అగ‌ర‌బ‌త్తులు.. పంచగవ్యాలతో సౌందర్య సాధనాలు ఉత్పత్తి చేస్తున్న తీరును ఉపరాష్ట్రపతికి ఈవో వివరించారు. శ్రీవారి దర్శనం అనంతరం తిరుమలలోని పుష్పగిరిమఠంలో జరుగుతున్న మనవరాలి వివాహ వేడుకలో ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు.


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని