sabja seeds: వేసవి తాపానికి చెక్... సబ్జా గింజలు చేసే మేలేంటో తెలుసా?
రోజురోజుకి పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో శరీరానికి ఆరారా చల్లని ద్రవాలన్ని, పదార్థాలని అందించడం చాలా అవసరం. లేదంటే శరీరం డీహైడ్రేట్ అయి వడదెబ్బకు గురయ్యే అవకాశాలు ఎక్కువ.
ఇంటర్నెట్ డెస్క్: రోజురోజుకి పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో శరీరానికి చల్లని ద్రవ పదార్థాలను అందించడం చాలా అవసరం. లేదంటే డీహైడ్రేట్ అయి వడదెబ్బకు గురయ్యే అవకాశాలు ఎక్కువ. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదనే నానుడి సబ్జా గింజల(sabja seeds)కు సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే సబ్జాల్లో ఉండే ఔషధగుణాలు అలాంటివి.
* ఎండ దెబ్బ నుంచి తక్షణమే ఉపశమనం కలిగించి శరీరంలో జీవ క్రియలు సక్రమంగా జరిగేందుకు ఇవి చాలా ఉపయోగపడతాయి.
* వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలే కాదు, సౌందర్య సంరక్షణకు ఉపయోగకరం.
* శరీరాన్ని వేసవి తాపానికి గురికాకుండా కాపాడేందుకు పండ్లు, మజ్జిగ, లస్సీ వంటి పదార్థలతో పాటు కొన్ని గింజలను కూడా భాగం చేసుకోవాలి.
* పండ్ల రసాలు తాగేటప్పుడు వాటిలో నానబెట్టిన సబ్జాలను కలుపుకుని తాగితే ఆరోగ్యంతో పాటు వేసవి తాపానికి చెక్ పడుతుంది.
* ఈ గింజల్లో ఉండే ఔషధగుణాలు డీటాక్సిఫికేషన్ నుంచి కాపాడుతాయి. వాహనాలు, గాలి, నీటి కాలుష్యం వల్ల చర్మం నల్లగా మారిపోతుంది. సబ్జా తీసుకోవడం వల్లన ఈ సమస్యను అధిగమించవచ్చు.
* శరీరంలో ఉండే రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్స్, కొవ్వు పదార్థాలు పుష్కలంగా లభిస్తాయి.
* మలబద్ధకాన్ని తగ్గించడంలో, పేగుల కదలికను ప్రోత్సాహించడంలో, మూత్రపిండాల పనితీరు పెంచడంలో, రక్తంలోని చక్కెర శాతాన్ని తగ్గించడం, నెమ్మదిగా బరువు తగ్గడానికి సహాయ పడుతుంది.
* జుట్టు ఊడిపోకుండా ఒత్తుగా పెరగడానికి కూడా ఇది సహాయ పడుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
‘నోటా’కు ఎక్కువ ఓట్లు వస్తే..? ఈసీకి సుప్రీం కోర్టు నోటీసులు
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..