యానాం ఎమ్మెల్యే అభ్యర్థి ఆచూకీ లభ్యం

పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో యానాం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెమ్మాడి దుర్గాప్రసాద్‌ ఆచూకీ లభ్యమైంది. కాకినాడ అచ్చంపేట...

Published : 05 Apr 2021 06:23 IST

యానాం:  పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో యానాం నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెమ్మాడి దుర్గాప్రసాద్‌ ఆచూకీ లభ్యమైంది. కాకినాడ అచ్చంపేట రోడ్డులో దుర్గాప్రసాద్‌ అపస్మారక స్థితిలో పడిఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈనెల 1న ఉదయం బయటకు వెళ్లిన తన భర్త దుర్గాప్రసాద్‌ ఇంటికి తిరిగి రాలేదని అతడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యానాం భాజపా అధ్యక్షుడిగా పనిచేసిన దుర్గాప్రసాద్‌ స్వంతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేయడంతో పార్టీ అధిష్ఠానం ఇటీవలే అతడిని సస్పెండ్‌ చేసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని