YS Bhaskar Reddy: వైఎస్‌ భాస్కర్‌రెడ్డి ఎస్కార్ట్‌ బెయిల్‌ పొడిగింపు

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడు వైఎస్‌ భాస్కర్‌రెడ్డి ఎస్కార్ట్‌ బెయిల్‌ను సీబీఐ కోర్టు పొడిగించింది. 

Published : 10 Oct 2023 16:51 IST

హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడు వైఎస్‌ భాస్కర్‌రెడ్డి ఎస్కార్ట్‌ బెయిల్‌ను సీబీఐ కోర్టు పొడిగించింది. తన ఎస్కార్ట్‌ బెయిల్‌ పొడిగించాలని కోరుతూ కడప ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డి సీబీఐ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. కంటికి కాటరాక్ట్‌ శస్త్రచికిత్స చేయించుకున్నట్లు తెలిపారు. వైద్యుల సూచన, తదుపరి చికిత్సల కోసం రెండు నెలల పాటు పొడిగించాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణ చేపట్టిన  సీబీఐ కోర్టు నవంబరు 1 వరకు ఎస్కార్ట్‌ బెయిల్‌ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని