కరోనా కాలంలో ఇదీ ‘బడి’!
ఇది కరోనా కాలం.. ఈ వైరస్ దెబ్బకు మనిషి జీవన ముఖచిత్రమే కాదు.. బడి స్వరూపమూ మారిపోయింది. ......
ఇంటర్నెట్ డెస్క్: ఇది కరోనా కాలం.. ఈ వైరస్ దెబ్బకు మనిషి జీవన ముఖచిత్రమే కాదు.. బడి స్వరూపమూ మారిపోయింది. విద్యా రంగానికి కొవిడ్ కొత్త పరీక్ష పెట్టింది. పరీక్షలు, కౌన్సెలింగ్లు, ప్రవేశాలతో హడావుడిగా సాగాల్సిన విలువైన సమయంలో విద్యార్థులు, తల్లిదండ్రులు మాస్క్లు, శానిటైజర్లు వైపు పరుగులు పెట్టేలా చేసింది. తమ పిల్లల చదువులు ఏమైపోతాయో అనే ఆందోళనను మిగిల్చింది. విద్యా ప్రణాళికతో పాటు బడులు స్వరూపాన్నే మార్చేసింది. ఈ మహమ్మారి కట్టడే లక్ష్యంగా విధించిన లాక్డౌన్ నుంచి అన్ని దేశాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. ఇందులో భాగంగా థాయ్లాండ్ ప్రభుత్వం తమ దేశంలోని పాఠశాలలను జులైలోనే ప్రారంభించింది. పాఠశాలల్లో ప్రత్యేక భద్రతా చర్యలు పాటిస్తూ కొత్త సాధారణ పరిస్థితులను తీసుకొచ్చింది. ఇప్పటికైతే భౌతికదూరమే ఉత్తమ వ్యాక్సిన్ అని నిపుణులు హెచ్చరిస్తున్న బ్యాంకాక్ పాఠశాలల్లో తీసుకుంటున్న చర్యలేంటో చూద్దామా?
ఆటలంటే పిల్లలకు చాలా ఇష్టం. అంతా కలిసి ఒకేచోట కలిసిమెలిసి ఆడుకోవాలనుకుంటారు. కానీ, కరోనా భయం వెంటాడటంతో బ్యాంకాక్లోని ద వాట్ ఖ్లోంగ్ టాయ్ పాఠశాలలో భౌతికదూరం పాటించేలా పిల్లల కోసం ప్రత్యేక బాక్స్లను ఏర్పాటు చేశారు. దీంతో కేజీ చిన్నారులు మాస్క్లు కట్టుకొని ఎవరికి కేటాయించిన బాక్స్లో వారే బొమ్మలతో ఆడుకొంటున్నారిలా..
ఆటలాడే సమయంలో పిల్లలు ఒకచోట నిలవరు. ముసిముసి నవ్వులతో అటూఇటూ పరుగులు తీస్తారు. అలాంటి చిన్నారులకు ఒక గీత గీసి అందులోనే కదలకుండా ఉండాలంటే కష్టమే. పాఠశాలల్లో భౌతికదూరం నిబంధనలు విధించిన వేళ వారికి ఈ కష్టాలు తప్పడంలేదు. మార్చి నెల మధ్యలోనే థాయ్లాండ్లో లాక్డౌన్ విధించారు. దీంతో అకస్మాత్తుగా పాఠశాలలన్నీ మూతబడ్డాయి. లాక్డౌన్ నిబంధనలు సడలించిన తర్వాత బ్యాంకాక్లోని ఈ పాఠశాల జులైలో ప్రారంభమైంది. చిన్నారులకు కొవిడ్ ముప్పు పొంచి ఉన్నందున పాఠశాలలను సురక్షిత వాతావరణంలో కొనసాగించేందుకు యాజమాన్యం, ఉపాధ్యాయులు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.
చిట్టిపొట్టి చిన్నారులు ఉపయోగించిన చోట పరిశుభ్రత తక్కువగా ఉండటం సాధారణమే. అలాంటప్పుడు కరోనా సమయంలో ఆ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం పాఠశాల యాజమాన్యాలకు పెద్ద సవాలే. కానీ, చిన్నారులు వాడిన షింక్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నారు. ప్రతి తరగతి గది బయట సబ్బులు, చేతుల్ని శుభ్రపరుచుకొనే షింక్లను ఏర్పాటు చేశారు. తరగతి గదితో పాటు భోజనం చేసే ప్రాంతాల్లో భౌతికదూరం పాటించేలా ప్లాస్టిక్ కవర్లతో బాక్స్ల్లా రూపొందించారు. అలాగే, హ్యాండ్ శానిటైజర్లు, ఉష్ణోగ్రతలు తెలిపే స్కానర్లను ఎక్కడికక్కడ ఉంచారు. దాదాపు నెల నుంచి ఈ పాఠశాల తెరిచి ఉన్నప్పటికీ అక్కడ ఒక్క కొవిడ్ కేసూ నమోదు కాకపోవడం విశేషం.
దేశ వ్యాప్తంగా పాఠశాలలను ప్రారంభించాలనే ఉద్దేశంతో థాయ్లాండ్ ప్రభుత్వం భద్రతా ప్రమాణాలను కొంతవరకు సడలించినప్పటికీ ద వాట్ ఖ్లోంగ్ టాయ్ పాఠశాల మాత్రం భౌతికదూరం నిబంధనలను కఠినంగా అమలుచేయాలని నిర్ణయించుకుంది.
ఆగ్నేయ ఆసియా దేశమైన థాయ్లాండ్ జనాభా దాదాపుగా ఏడు కోట్లు. అక్కడ కరోనా మరణాలు ఇతర దేశాలతో పోలిస్తే చాలా తక్కువ. ఇప్పటివరకు థాయ్లాండ్లో 3356 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. వారిలో 3169మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఈ వైరస్ బారిన పడి కేవలం 58మంది మాత్రమే ప్రాణాలు కోల్పోయారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
WhatsApp: యూజర్ల సందేశాలకు భద్రత కల్పించేందుకు సంభాషణలను ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ చేస్తున్నామని వాట్సప్ తెలిపింది. ఒకవేళ దాన్ని బ్రేక్ చేయాలని చెబితే తాము భారత్ను వీడాల్సి వస్తుందని స్పష్టం చేసింది. -
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
విజయ్ మాల్యా విదేశాల్లోని ఆస్తులపై భారత ప్రభుత్వం దృష్టిపెట్టింది. దీంతోపాటు ఆ దేశాలకు అతడు వస్తే అప్పగించాలని కోరుతోంది. తాజాగా ఫ్రాన్స్ను ఈ మేరకు అభ్యర్థించింది. -
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
Supreme Court: ఎన్నికల కౌంటింగ్లో మొత్తం వీవీ ప్యాట్ స్లిప్లను లెక్కించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్