ట్రంప్ సార్, మీరే కరెక్ట్ ... కంగనా రనౌత్
సమాజంలో భాగంగా ఉన్న మనం.. ఏది నిజమైన సిగ్గుచేటు పని అనేది గుర్తించాలి.’’ అని కంగన అన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తన ప్రత్యర్థి జో బిడెన్ను సవాలు చేయటం సరైన చర్య అని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సమర్ధించారు. తన ప్రత్యర్ధి బిడెన్ మాదక ద్రవ్యాలు వాడుతున్నారని.. ఆయన నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలని ట్రంప్ సవాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తల్లిని అవమానించడం, మానసిక అనారోగ్యాన్ని అపహాస్యం చేయటం వంటి హేయమైన చర్యల కంటే ఈ విధంగా ఆరోపించటమే ఉత్తమమని కంగన అభిప్రాయపడ్డారు. అయితే ఆయన ట్వీట్లో ఏముందని కాకుండా.. ఆ సందర్భాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఆమె కోరారు.
‘‘ఎప్పుడూ నిద్రపోతున్నట్టుండే జో బిడెన్, మంగళవారం రాత్రి జరుగనున్న చర్చకు ముందు లేదా తర్వాత, ఎప్పుడైనా డ్రగ్ టెస్ట్ చేయించుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా నేను కూడా ఆ పరీక్ష చేయించుకునేందుకు సిద్ధంగా ఉన్నాను. ఉపన్యాసాలు ఇవ్వటంలో రికార్డు సృష్టించే విధంగా ఉన్న ఆయన ప్రదర్శన, అసహజంగా ఉంది. ఆయనలో ఇంత వ్యత్యాసానికి కేవలం డ్రగ్స్ మాత్రమే కారణం కాగలవు.’’ అని తన ట్వీట్లో ట్రంప్ విమర్శించారు.
కాగా కంగన ట్రంప్ ట్వీట్ను ఉదహరిస్తూ.. ‘‘ట్వీట్లో ఉన్న విషయాన్ని పక్కన పెడితే, ఆ సందర్భాన్ని నేను మెచ్చుకుంటున్నాను. మత్తు మందులు తీసుకోవడాన్ని అందరూ చెడ్డ విషయంగా భావిస్తారు. కానీ ఓ మాతృమూర్తి పునరుత్పత్తి అవయవాలను, వ్యక్తుల మానసిక అనారోగ్యాన్ని గురించి అవమానకరంగా మాట్లాడటం కన్నా ఇది చెడ్డదేమీ కాదు. సమాజంలో భాగంగా ఉన్న మనం.. ఏది నిజమైన సిగ్గుచేటు పని అనేది గుర్తించాలి.’’ అని ఆమె ఘాటుగా విమర్శించారు.
నటుడు సుశాంత్ సింగ్ రాజ్పూత్ మృతి నేపథ్యంలో బాలీవుడ్ వ్యక్తుల ప్రమేయంపై ఎన్సీబీ విచారణ చేపట్టిన సంగతి చెందిందే. ఈ నేపథ్యంలో రియా చక్రవర్తి అరెస్టు కాగా.. దీపికా పదుకొణె, రకుల్ ప్రీత్ సింగ్లను సంస్థ విచారించింది. ఈ నేపథ్యంలో కంగన వ్యాఖ్యలు ప్రాముఖ్యం సంతరించుకున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంజిన్ నుంచి విడిపోయిన బోగీలు
పంజాబ్లోని సర్హింద్ నుంచి జమ్మూకు వెళ్తున్న ఓ గూడ్సు రైలు ఇంజిన్ నుంచి బోగీలు విడిపోయినట్లు అధికారులు తెలిపారు. -
ఛత్తీస్గఢ్లో 35 మంది మావోయిస్టుల లొంగుబాటు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లాలో ఎస్పీ గౌరవ్రాయ్ ఎదుట 35 మంది మావోయిస్టులు ఆదివారం లొంగిపోయారు. సుక్మా, దంతెవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దు దండకారణ్యంలో వీరు పని చేస్తున్నారు. -
రేవణ్ణకు కస్టడీ పొడిగింపు.. ప్రజ్వల్ కోసం వేట
మహిళ అపహరణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి హెచ్.డి.రేవణ్ణ విచారణ కోసం నాలుగు రోజులపాటు సిట్ కస్టడీకి అనుమతిస్తూ సంబంధిత ప్రత్యేక న్యాయస్థానం ఆదివారం ఉత్తర్వులిచ్చింది. -
ఐసీయూల్లో జీవన్మృతుల కేసులను పర్యవేక్షించండి
ఐసీయూ రోగుల్లో జీవన్మృతుల కేసులను పర్యవేక్షించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. వాటిని సరిగా గుర్తించకపోవడం, ధ్రువీకరించకపోవడం వల్ల దేశంలో అవయవ దానాల రేటు చాలా తక్కువగా ఉందని పేర్కొంది. -
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
కర్ణాటకలో కలకలం రేపుతున్న జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ లైగింక వేధింపుల వ్యవహారంపై ప్రధాని మోదీ స్పందించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. -
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వివాదంలో చిక్కుకున్నారు. -
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
లైంగిక వేధింపులకు సంబంధించి రాష్ట్ర పోలీసుల నుంచి వచ్చే ఏ సమాచారాన్ని పట్టించుకోవద్దని తన కార్యాలయ సిబ్బందిని పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆదేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
కర్ణాటకలో అధునాతనం.. ఏపీలో అధ్వానం!
-
ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావుకు అవకాశం!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (06/05/24)
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్