అలర్జీ ఉంటే..టీకా తీసుకోకండి
మంగళవారం నుంచి బ్రిటన్లో ఫైజర్/ బయోఎన్టెక్ సంయుక్తంగా రూపొందించిన టీకాను ప్రజలకు అందజేస్తున్న సంగతి తెలిసిందే.
ప్రజలకు సూచించిన యూకే ప్రభుత్వం
లండన్: ఫైజర్-బయోఎన్టెక్ సంయుక్తంగా రూపొందించిన టీకాను మంగళవారం నుంచి బ్రిటన్ ప్రజలకు అందజేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొందరిలో తీవ్ర అలర్జీ లక్షణాలు కనిపించాయి. దీంతో గతంలో ఏదైనా ఔషధం, ఆహారం, టీకా వాడినప్పుడు అలర్జీ లాంటిదేమైనా వస్తే అటువంటి వారు ఫైజర్ టీకాకు దూరంగా ఉండాలని బ్రిటన్ ఔషధ నియంత్రణ సంస్థ హెచ్చరించింది. బ్రిటన్ తొలుత ఈ టీకాను ఆరోగ్య సిబ్బంది, 80 ఏళ్ల వయసు పైబడినవారితో పాటు కేర్ హోమ్ వర్కర్లకు అందిస్తోంది.
కాగా, ప్రజలకు టీకా పంపిణీ ప్రారంభమైన దగ్గరి నుంచి తీవ్రమైన అలర్జీ(అనాఫిలాక్సిస్)కి గురైన రెండు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఇంకోటి కూడా దాదాపు అలాంటి సంఘటననే అధికారులు గుర్తించారని ఔషధ నియంత్రణ సంస్థ వెల్లడించింది. ‘గతంలో ఏదైనా ఔషధం, ఆహారం, టీకా వాడినప్పుడు అలర్జీ లాంటిదేమైనా వస్తే అటువంటి వారు ఫైజర్ టీకాకు దూరంగా ఉండాలి. చాలా మందికి ఈ పరిస్థితి ఎదురుకాదు. కొవిడ్-19 నుంచి ప్రజలను రక్షించడంలో ఈ టీకా ప్రయోజనాలు.. ప్రమాదాలను అధిగమిస్తాయి. దీని భద్రత, నాణ్యత, ప్రభావం.. ప్రమాణాలకు అనుగుణంగా ఉందని విశ్వసించవచ్చు’ అని ఔషధ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జూన్ రెయిన్ ఓ ప్రకటనలో వెల్లడించారు.
శరీర రోగ నిరోధక శక్తి అతిగా స్పందించడాన్ని అనాఫిలాక్సిస్గా చెప్తారు. ఇది కొన్నిసార్లు ప్రాణాంతకంగా మారవచ్చని నిపుణులు వెల్లడించారు. దాంతో నిపుణులను సంప్రదించిన తరవాత అలెర్జీ ప్రతిచర్యలు తీవ్రంగా ఉన్నవారు ఈ టీకా డోసును తీసుకోవద్దని ఔషధ సంస్థ సూచించింది. కాగా, దీనిపై తాము దర్యాప్తుకు సహకరిస్తామని ఫైజర్ సంస్థ ప్రకటించింది. మరోవైపు, అమెరికాకు చెందిన ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ(ఎఫ్డీఏ), ఐరోపా ఔషధాల సంస్థ(ఈఎంఏ) ఈ డేటాను విశ్లేషిస్తున్నాయి.
బ్రిటన్లో వెలుగుచూసిన ఘటనలను దృష్టిలో ఉంచుకొని.. తీవ్రమైన అలర్జీ సమస్యలున్న అమెరికన్లు ఫైజర్ టీకాను తీసుకునేవారి జాబితాలో ఉండకపోవచ్చని అక్కడి ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఆ దేశంలో వెలుగుచూసిన ప్రతికూల చర్యలను పరిశీలిస్తున్నామని కెనడా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇదిలా ఉండగా..భారత్లో అత్యవసర వినియోగం కోసం ఇప్పటికే భారత్ బయోటెక్, సీరం సంస్థలతో పాటు ఫైజర్ కూడా దరఖాస్తు చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై డీసీజీఐ సమీక్ష జరిపి రెండు వారాల్లో నిర్ణయం తీసుకోనున్నట్లు వార్తలు వచ్చాయి.
ఇవీ చదవండి:
ఆకలి తీర్చుకునేందుకు అప్పులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
-
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
-
ఓ అన్న మాట్లాడాల్సిన మాటలేనా?.. షర్మిల చీరపై జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు
-
కూకట్పల్లిలో హత్యాచారం కేసు.. 45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ