Air India: ఇంటర్నెట్లో చూశా.. రూ.25 వేలు కట్టను.. : ప్రయాణికుడి వాదన!
ఇటీవల ఎయిర్ ఇండియా విమానంలో అనుచితంగా ప్రవర్తించిన ఓ ప్రయాణికుడికి కోర్టు బెయిల్ మంజూరు చేసినా.. అతడు నిరాకరించడం గమనార్హం. బెయిల్ మొత్తం రూ.25 వేలు తాను చెల్లించనని, ఈ కేసులో జరిమానా కేవలం రూ.250గా ఉన్నట్లు ఆన్లైన్లో చదివానని అతడు వాదించాడు.
ముంబయి: ఇటీవల ఎయిర్ ఇండియా(Air India) విమానంలో ఓ వ్యక్తి సిగరెట్ తాగడం కలకలం రేపిన విషయం తెలిసిందే. తన అనుచిత ప్రవర్తన(Unruly Behaviour)తో తోటి ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసిన అతడిని.. కాళ్లు, చేతులు కట్టేసి సీటులో కూర్చొబెట్టారు. అనంతరం విమానయాన సిబ్బంది ఫిర్యాదుతో అతడిపై కేసు నమోదయ్యింది. ఈ క్రమంలోనే కోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసినా.. తన ‘ఇంటర్నెట్’ వాదనతో దాన్ని నిరాకరించి, జైలుకే వెళ్తానని చెప్పడం గమనార్హం. దీంతో కోర్టు అతడిని జైలుకు తరలించాలని ఆదేశించింది.
భారత సంతతికి చెందిన రత్నాకర్ ద్వివేది(37) ఇటీవల లండన్ నుంచి ముంబయికి ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించాడు. విమానంలోని బాత్రూంకి వెళ్లి పొగ తాగుతుండగా.. అప్రమత్తమైన సిబ్బంది అతడిని అడ్డుకున్నారు. దీంతో అరవడం మొదలుపెట్టిన అతడు.. అంతటితో ఆగకుండా విమాన డోర్ను తెరిచేందుకు యత్నించాడు. అతడి ప్రవర్తనతో భయభ్రాంతులకు గురైన ప్రయాణికులు వారించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో చివరకు అతడి కాళ్లు, చేతులు కట్టేసి కుర్చీలోనే కూర్చునేలా చేశామని విమాన సిబ్బంది వెల్లడించారు.
ముంబయి చేరుకున్న వెంటనే అతడిని ఎయిర్పోర్టు సెక్యూరిటీకి అప్పజెప్పడంతోపాటు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఎయిరిండియా వెల్లడించింది. దీంతో అతడిపై ఐపీసీతోపాటు ఎయిర్క్రాఫ్ట్ చట్టం 1937లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. దీనిపై విచారణ చేపట్టిన అంధేరీ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు.. రూ.25 వేల పూచికత్తుతో బెయిల్ మంజూరు చేసింది. అయితే, బెయిల్ మొత్తాన్ని చెల్లించేందుకు అతడు నిరాకరించాడు. ఇంటర్నెట్లో వెతికితే సంబంధిత సెక్షన్ కింద రూ.250 మాత్రమే జరిమానాగా ఉందని, అంతే చెల్లిస్తానని వాదించాడు. కావాలంటే.. జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పాడు. దీంతో కోర్టు అతడిని జైలుకు తరలించాలని ఆదేశించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంజిన్ నుంచి విడిపోయిన బోగీలు
పంజాబ్లోని సర్హింద్ నుంచి జమ్మూకు వెళ్తున్న ఓ గూడ్సు రైలు ఇంజిన్ నుంచి బోగీలు విడిపోయినట్లు అధికారులు తెలిపారు. -
ఛత్తీస్గఢ్లో 35 మంది మావోయిస్టుల లొంగుబాటు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లాలో ఎస్పీ గౌరవ్రాయ్ ఎదుట 35 మంది మావోయిస్టులు ఆదివారం లొంగిపోయారు. సుక్మా, దంతెవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దు దండకారణ్యంలో వీరు పని చేస్తున్నారు. -
రేవణ్ణకు కస్టడీ పొడిగింపు.. ప్రజ్వల్ కోసం వేట
మహిళ అపహరణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి హెచ్.డి.రేవణ్ణ విచారణ కోసం నాలుగు రోజులపాటు సిట్ కస్టడీకి అనుమతిస్తూ సంబంధిత ప్రత్యేక న్యాయస్థానం ఆదివారం ఉత్తర్వులిచ్చింది. -
ఐసీయూల్లో జీవన్మృతుల కేసులను పర్యవేక్షించండి
ఐసీయూ రోగుల్లో జీవన్మృతుల కేసులను పర్యవేక్షించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. వాటిని సరిగా గుర్తించకపోవడం, ధ్రువీకరించకపోవడం వల్ల దేశంలో అవయవ దానాల రేటు చాలా తక్కువగా ఉందని పేర్కొంది. -
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
కర్ణాటకలో కలకలం రేపుతున్న జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ లైగింక వేధింపుల వ్యవహారంపై ప్రధాని మోదీ స్పందించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. -
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వివాదంలో చిక్కుకున్నారు. -
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
లైంగిక వేధింపులకు సంబంధించి రాష్ట్ర పోలీసుల నుంచి వచ్చే ఏ సమాచారాన్ని పట్టించుకోవద్దని తన కార్యాలయ సిబ్బందిని పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆదేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
కర్ణాటకలో అధునాతనం.. ఏపీలో అధ్వానం!
-
ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావుకు అవకాశం!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (06/05/24)
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్