Sandeshkhali: సందేశ్ఖాలీ ఘటనలు.. ఒకశాతం నిజమైనా: దీదీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం
Sandeshkhali: పౌరుల భద్రతకు ప్రమాదం ఏర్పడితే.. అందుకు ప్రభుత్వానిదే బాధ్యత అని కలకత్తా హైకోర్టు వ్యాఖ్యానించింది.
కోల్కతా: పశ్చిమ బెంగాల్ (West Bengal)లోని సందేశ్ఖాలీ (Sandeshkhali) గ్రామం ఇటీవల వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC)కు చెందిన షాజహాన్ షేక్, అతడి అనుచరులు.. మహిళలపై అకృత్యాలకు పాల్పడటమే గాక, వారి భూములను బలవంతంగా లాక్కొన్నట్లుు వచ్చిన ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి. ఈ ఘటనలపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సందర్భంగా మమతా బెనర్జీ ప్రభుత్వంపై కలకత్తా హైకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. పౌరుల భద్రతకు ముప్పు ఏర్పడితే.. అందుకు ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అని స్పష్టంచేసింది.
ఈ వివాదంపై దర్యాప్తు జరిపించాలని దాఖలైన అఫిడవిట్లపై స్పందిస్తూ.. ‘‘అఫిడవిట్ లో పేర్కొన్న ఒక్క విషయం నిజమైనా, అందులో ఒక శాతం వాస్తవమున్నా అది సిగ్గుచేటు. అధికార పార్టీ, స్థానిక యంత్రాంగం అందుకు పూర్తి నైతిక బాధ్యత వహించాలి’’ అని ఘాటు వ్యాఖ్యలు చేసింది. అలాగే అరెస్టు తప్పించుకునేందుకు షాజహాన్ షేక్ కొంతకాలంపాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. 55 రోజుల పాటు షాజహాన్ పరారీలో ఉండడంపై కోర్టు అసహనం వ్యక్తంచేసింది. ఫిబ్రవరి నెలలో పోలీసులు అతడిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసు న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.
తోటి ఖైదీలకు దూరంగా, పుస్తకాలు చదువుతూ.. తిహాడ్ జైల్లో కేజ్రీవాల్ దినచర్య!
ఇదిలాఉంటే, షాజహాన్ అకృత్యాలకు ఎదురొడ్డి నిలిచిన రేఖా పత్రా.. అక్కడి మహిళలు చేపట్టిన ఆందోళనలకు నాయకత్వం వహించారు. అతడి అనుచరుల బెదిరింపులకు లొంగకుండా ధైర్యంగా ముందుకొచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయడమే గాక.. కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. ఆమెకు బెంగాల్లోని బసిర్హట్ స్థానం నుంచి భాజపా టికెట్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమ్మాయి చదువు ఇంటికి వెలుగు
ఆ కుటుంబానికి ఏళ్లుగా రాత్రిపూట కొవ్వొత్తులే దిక్కు. ఆ వెలుతురులోనే వారి కుమార్తె చదువుకుంది. ఎక్కువ మార్కులు సాధించడంతో అధికారులు ఉచిత విద్యుత్ కనెక్షన్ ఇచ్చారు. -
‘4.24 లక్షల ఫిర్యాదులు’
ఎన్నికల నియమావళి ఉల్లంఘనలకు సంబంధించి ‘సీ-విజిల్’ యాప్నకు రెండు నెలల్లో 4.24 లక్షల ఫిర్యాదులు వచ్చినట్లు ఈసీ వెల్లడించింది. -
కశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదుల కాల్పులు
జమ్మూ కశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లా పహల్గాంవద్ద శనివారం రాత్రి పర్యాటకుల క్యాంప్పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో రాజస్థాన్కు చెందిన జంట గాయపడ్డారు. -
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
మరో ఆరు నెలల్లో పీవోకే భారత్లో విలీనమవడం ఖాయమని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. కానీ, మూడోసారి కూడా ప్రధానిగా మోదీ ఎన్నికైతేనే అది సాధ్యమవుతుందని అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఫుట్బోర్డు మీదనుంచి జారిపడి మహిళ దుర్మరణం
-
ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ఫొటోతో నకిలీ వాట్సప్ కాల్స్
-
‘డబ్బు తిన్న వారిపై కుక్కల్ని వదలండి’.. కొడాలి నాని అనుచరుడి వీడియో వైరల్
-
భూమి రాసివ్వకపోతే.. చంపేస్తామన్నారు!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/05/24)
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!