వ్యాక్సిన్ పంపిణీలో కీలకంగా ‘కో-విన్’
ప్రపంచంలోనే భారీ ఎత్తున చేపడుతోన్న కొవిడ్ టీకా పంపిణీ కార్యక్రమంలో ‘కో-విన్’ యాప్ కీలకంగా ఉండనుందని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టంచేసింది
రాష్ట్రాల అధికారులతో కేంద్ర బృందం సమావేశం
దిల్లీ: ప్రపంచంలోనే భారీ ఎత్తున భారత్ చేపడుతోన్న కొవిడ్ టీకా పంపిణీ కార్యక్రమంలో ‘కో-విన్’ యాప్ కీలకంగా ఉండనుందని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. చిట్టచివరి వ్యాక్సిన్ పంపిణీ కూడా ఈ సాఫ్ట్వేర్ ద్వారానే జరుగుతుందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ, సంక్షేమ శాఖ వెల్లడించింది. వ్యాక్సిన్పై ఏర్పాటు చేసిన జాతీయ నిపుణుల బృందానికి నేతృత్వం వహిస్తోన్న రామ్ సేవాక్ శర్మ ఆధ్వర్యంలో ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమయ్యింది. జనవరి 16 నుంచి ప్రారంభం కానున్న వ్యాక్సిన్ పంపిణీకి ఏర్పాట్లపై ఈ బృందం రాష్ట్రాలకు తగు సూచనలను చేసింది.
దేశంలో వ్యాక్సిన్ తీసుకునే ప్రతి ఒక్కరి వివరాలను ఈ సాఫ్ట్వేర్ ద్వారానే నివేదించాలని నిపుణుల బృందం రాష్ట్రాలకు సూచించింది. వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి వివరాలు, ఆయనకు ఎవరు వ్యాక్సిన్ ఇచ్చారు, ఏ సంస్థకు చెందిన వ్యాక్సిన్ను ఇచ్చారనే విషయాల డిజిటల్ రికార్డును ఈ సాఫ్ట్వేర్లో కచ్చితంగా పొందుపరచాలని స్పష్టంచేసింది. వ్యాక్సిన్ తీసుకున్న వారి వివరాలను కూడా ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలని రాష్ట్రాలకు సూచించింది. అయితే, వ్యాక్సిన్ ప్రతి ఒక్కరికీ అందించడమే లక్ష్యంతో ఈ సాఫ్ట్వేర్ తయారు చేశామని, ఏ సమయంలోనైనా, ఎక్కడైనా వ్యాక్సిన్ దొరుకుతుందని పౌరులకు తెలియజేసే విధంగా దీన్ని రూపొందించామని పేర్కొంది. అయితే, వ్యాక్సిన్ సమాచారం పొందుపరిచే సమయంలో ఎలాంటి ఆటంకం లేకుండా వీటిని ఆన్లైన్, ఆఫ్లైన్లలో కూడా చేసుకోవచ్చని అధికారులకు సూచించింది. సమాచారాన్ని పంపించడంలో ఆలస్యాన్ని మాత్రం ఎట్టిపరిస్థితుల్లో అనుమతించమని స్పష్టంచేసింది.
వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్ సమయంలో మొబైల్ నెంబర్, ఆధార్ను నమోదుచేసుకునేలా ఆయా రాష్ట్రాలు ప్రజలకు తెలియజేయాలని విజ్ఞప్తిచేసింది. తద్వారా ఎటువంటి సమస్యలు లేకుండా వారి మొబైల్ నెంబర్కే వ్యాక్సిన్ గురించిన సమాచారం అందుతుందని పేర్కొంది. అంతేకాకుండా సాఫ్టవేర్పై అభిప్రాయాలు, చేయాల్సిన మార్పులపైనా రాష్ట్రాలనుంచి సలహాలు/ సూచనలను తీసుకుంది.
ఇవీ చదవండి..
కోవిన్ యాప్ ద్వారానే టీకా పంపిణీ..!
ఏ టీకా పవరెంతా..?
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇంజిన్ నుంచి విడిపోయిన బోగీలు
పంజాబ్లోని సర్హింద్ నుంచి జమ్మూకు వెళ్తున్న ఓ గూడ్సు రైలు ఇంజిన్ నుంచి బోగీలు విడిపోయినట్లు అధికారులు తెలిపారు. -
ఛత్తీస్గఢ్లో 35 మంది మావోయిస్టుల లొంగుబాటు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లాలో ఎస్పీ గౌరవ్రాయ్ ఎదుట 35 మంది మావోయిస్టులు ఆదివారం లొంగిపోయారు. సుక్మా, దంతెవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దు దండకారణ్యంలో వీరు పని చేస్తున్నారు. -
రేవణ్ణకు కస్టడీ పొడిగింపు.. ప్రజ్వల్ కోసం వేట
మహిళ అపహరణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ మంత్రి హెచ్.డి.రేవణ్ణ విచారణ కోసం నాలుగు రోజులపాటు సిట్ కస్టడీకి అనుమతిస్తూ సంబంధిత ప్రత్యేక న్యాయస్థానం ఆదివారం ఉత్తర్వులిచ్చింది. -
ఐసీయూల్లో జీవన్మృతుల కేసులను పర్యవేక్షించండి
ఐసీయూ రోగుల్లో జీవన్మృతుల కేసులను పర్యవేక్షించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. వాటిని సరిగా గుర్తించకపోవడం, ధ్రువీకరించకపోవడం వల్ల దేశంలో అవయవ దానాల రేటు చాలా తక్కువగా ఉందని పేర్కొంది. -
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
కర్ణాటకలో కలకలం రేపుతున్న జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ లైగింక వేధింపుల వ్యవహారంపై ప్రధాని మోదీ స్పందించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. -
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ వివాదంలో చిక్కుకున్నారు. -
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
లైంగిక వేధింపులకు సంబంధించి రాష్ట్ర పోలీసుల నుంచి వచ్చే ఏ సమాచారాన్ని పట్టించుకోవద్దని తన కార్యాలయ సిబ్బందిని పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆదేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
కర్ణాటకలో అధునాతనం.. ఏపీలో అధ్వానం!
-
ఏపీ డీజీపీగా ద్వారకా తిరుమలరావుకు అవకాశం!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (06/05/24)
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్