Kejriwal: వాయు కాలుష్యంపై దిల్లీ వార్.. 10పాయింట్ల వ్యూహం ఇదే!
దేశ రాజధాని నగరాన్ని ఊపిరాడనీయకుండా చేసే వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు కేజ్రీవాల్ ప్రభుత్వం పకడ్బందీ వ్యూహాలను అమలుచేస్తోంది......
దిల్లీ: దేశ రాజధాని నగరాన్ని ఊపిరాడనీయకుండా చేసే వాయు కాలుష్యాన్ని నియంత్రించేందుకు కేజ్రీవాల్ ప్రభుత్వం పకడ్బందీ వ్యూహాలను అమలుచేస్తోంది. ఈ కాలుష్యాన్ని తగ్గించేందుకు ఇప్పటికే సరి-బేసి విధానం సహా పలు చర్యలను చేపట్టిన అక్కడి ప్రభుత్వం.. తాజాగా ‘వింటర్ యాక్షన్ ప్లాన్’ పేరిట 10 పాయింట్ల ప్రణాళికను ప్రకటించింది. ఈ మేరకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఈ ప్రణాళికను ప్రకటించారు. శీతాకాలంలో వాయు కాలుష్యం దిల్లీ నగరాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ముందుగానే ఈ ప్రణాళికను విడుదల చేశారు. అంతేకాకుండా కాలుష్య నివారణకు పరస్పరం సహకరించుకుంటూ సమష్టిగా పోరాడదామని పొరుగు రాష్ట్రాలకు విజ్ఞప్తి చేశారు.
వింటర్ యాక్షన్ ప్లాన్లో 10 అంశాలివే..
పంట వ్యర్థాలను కాల్చకుండా బయో డీ-కంపోజర్ స్ర్పే చేయడం; దుమ్ము, ధూళి కాలుష్యాన్ని నియంత్రణకు కార్యాచరణ; చెత్తను తగులబెడితే జరిమానా విధించడం; బాణసంచాపై నిషేధం; స్మాగ్ టవర్ల ఏర్పాటు; హాట్స్పాట్ల పర్యవేక్షణ; గ్రీన్వార్ రూమ్లు బలోపేతం చేయడం; గ్రీన్ దిల్లీ యాప్; దేశంలోనే తొలి ఈ-వ్యర్థాల పార్కు; వాహనాల కాలుష్య నియంత్రణ చేయడం
స్మాగ్ టవర్తో మంచి ఫలితాలొచ్చాయ్..
శీతాకాలంలో వాయుకాలుష్యం విపరీతంగా పెరిగిపోవడానికి ప్రధాన కారణం పంట వ్యర్థాలను తగులబెట్టడమేనని, ఈ వ్యవహారంపై పొరుగు రాష్ట్రాలు గానీ, కేంద్ర ప్రభుత్వం గానీ ఏమీ చేయడంలేదని ఈ సందర్భంగా కేజ్రీవాల్ విమర్శించారు. గాలిని స్వచ్ఛంగా ఉంచేందుకు ఉమ్మడిగా కృషిచేద్దామని ఆయా రాష్ట్రాలకు పిలుపునిచ్చారు. పంట వ్యర్థాల మేనేజ్మెంట్కు దిల్లీ మాదిరిగానే బయో డీ-కంపోజర్ పద్ధతిని విస్తృతంగా అమలుచేయాలని కోరారు. దిల్లీలో నిర్మాణంలో ఉన్న కట్టడాల నుంచి వచ్చే ధూళిని నియంత్రణను పర్యవేక్షించేందుకు 75 బృందాలు; అలాగే, చెత్తను తగులబెట్టే అంశాన్ని పర్యవేక్షించేందుకు 250 బృందాలను ఏర్పాటు చేసినట్టు సీఎం తెలిపారు. కన్నౌట్ ప్లేస్ వద్ద ఏర్పాటు చేసిన స్మాగ్ టవర్ మంచి ఫలితాలను ఇచ్చిందని.. దాని పనితీరును పర్యవేక్షించడంతో పాటు నగరంలో అలాంటి మరిన్ని టవర్ల నిర్మాణం చేపడతామన్నారు.
ఈ-వ్యర్థాల కోసం దేశంలోనే తొలి ఎకో పార్కు
కాలుష్య హాట్ స్పాట్లను సమీక్షించేలా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. వాహనాల నుంచి వచ్చే కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు ట్రాఫిక్ జామ్ సమస్యను పరిష్కరించేందుకు 64 రహదారులను గుర్తించినట్టు తెలిపారు. నగరంలో కాలుష్య నియంత్రణ సర్టిఫికెట్లు తనిఖీ చేసేందుకు వీలుగా 500 బృందాలు ఏర్పాటు చేసినట్టు చెప్పారు. గ్రీన్ వార్ రూమ్లను బలోపేతం చేయడంతో పాటు ప్రజా అవగాహన కార్యక్రమాలు ఈ ‘వింటర్ యాక్షన్ ప్లాన్’లో భాగంగా ఉందన్నారు. ఈ-వ్యర్థాలను నిర్వహించేలా దేశంలోనే తొలి ఎకో పార్కు దిల్లీలో ఏర్పాటవుతోందన్నారు. ప్రస్తుతం వాయు కాలుష్యం నియంత్రణలోనే ఉందని.. కానీ శీతాకాలంలో పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను కాల్చడం వల్ల ఇది పెరుగుతుందని కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తంచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు