సరైన సమయంలో ఆదుకున్నారు..మోదీజీ..
తమ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బొల్సొనారో భారత ప్రధాని నరేంద్రమోదీకి కృతజ్ఞతలు తెలిపారు.
హైడ్రాక్సీక్లోరోక్విన్ సరఫరాపై బ్రెజిల్ అధ్యక్షుడు
దిల్లీ: తమ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బొల్సొనారో భారత ప్రధాని నరేంద్రమోదీకి కృతజ్ఞతలు తెలిపారు. బ్రెజిల్ ప్రజలను సరైన సమయంలో ఆదుకున్నారని వెల్లడించారు. మలేరియాను నయం చేసే హైడ్రాక్సీక్లోరోక్విన్ సరఫరాకు భారత్ అంగీకరించడమే అందుకు కారణం. ప్రపంచాన్ని గడగడలాడిస్తోన్న కొవిడ్ 19 చికిత్సలో ఇది ప్రభావవంతంగా పనిచేస్తుందని పరిశోధకులు ప్రాథమికంగా నిర్ధారించడంతో ఒక్కసారిగా ఆ మందులకు డిమాండ్ పెరిగిపోయింది.
హైడ్రాక్సీక్లోరోక్విన్ సరఫరాపై బొల్సొనారో మాట్లాడుతూ..‘మనకు మరింత ఆనందాన్నిచ్చే శుభవార్త. భారత ప్రధాని నరేంద్ర మోదీతో చర్చల కారణంగా హైడ్రాక్సీక్లోరోక్విన్ తయారీకి కావాల్సిన ముడి పదార్థాలు శనివారానికి మనదేశానికి చేరుకుంటాయి. దాంతో మనం కొవిడ్ 19, మలేరియా, ఆర్థరైటిస్ వంటి ఇతర వ్యాధులను నయం చేసుకోగలం. ఈ క్లిష్ట పరిస్థితుల్లో సరైన సమయంలో సహకరించిన భారత ప్రధాని, ఆ దేశ ప్రజలకు కృతజ్ఞతలు చెప్తున్నాను’ అని వెల్లడించారు. భారత ఇతిహాసమైన రామాయణంలో లక్ష్మణుడి కోసం హనుమంతుడు సంజీవనిని తెచ్చిన ఘట్టాన్ని ఉద్దేశించి కొద్దిరోజల క్రితం హైడ్రాక్సీక్లోరోక్విన్ కోసం అభ్యర్థిస్తూ బొల్సొనారో లేఖ రాశారు. అలాగే దానిపై మోదీతో ఫోన్లో కూడా చర్చించారు.
ఇదిలా ఉండగా, వైరస్ కట్టడికి అధ్యక్షుడు తీసుకుంటున్న చర్యలపై ఆ దేశంలోని కొన్నివర్గాల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి. అది కేవలం ఫ్లూ అంటూ అధ్యక్షుడు కరోనా తీవ్రతను కొట్టిపారేయడం వారి ఆగ్రహానికి కారణమైంది. ఆ దేశంలో 15వేల మందికి పైగా కరోనా వైరస్ బారిన పడగా, 127 మంది మరణించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల
-
కొండయ్య.. లెక్కే వేరు