సోషల్ మీడియా సంస్థలకు ట్రంప్ హెచ్చరిక!
ట్రంప్ ట్వీట్లపై ట్విటర్ చేపట్టిన ఫ్యాక్ట్చెక్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది తన భావప్రకటన స్వేచ్ఛను ఉల్లంఘించిందని ట్విటర్పై విరుచుకుపడ్డారు.
ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై త్వరలోనే సంతకం..
వాషింగ్టన్: ట్రంప్ ట్వీట్లపై ట్విటర్ చేపట్టిన ఫ్యాక్ట్చెక్ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా పరిగణించారు. ఇది తన భావప్రకటన స్వేచ్ఛకు ఆటంకం కలిగించే విషయమని విరుచుకుపడ్డారు. రిపబ్లికన్లను అణచివేయడానికే కొందరు ప్రయత్నిస్తున్నట్లు నమ్ముతున్నట్లు ప్రకటించారు. సామాజిక మాధ్యమాలపై కఠిన చర్యలు ఉంటాయని ట్రంప్ స్పష్టంచేశారు. సోషల్ మీడియాను తప్పకుండా నియంత్రిస్తామని హెచ్చరించారు. 2016లో కూడా తనపై ఇదే తరహాలో ప్రయత్నించి సామాజిక మాధ్యమాలు విఫలం అయ్యాయని.. ఈసారి వాటి ప్రయత్నాన్ని అడ్డుకుంటామని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై త్వరలోనే ట్రంప్ సంతకం చేయనున్నట్లు వైట్హౌజ్ అధికార ప్రతినిధి తాజాగా వెల్లడించారు.
ట్విటర్ను విమర్శించిన ఫేస్బుక్ సీఈవో..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్వీట్లను ఫ్యాక్ట్చెక్ చేసే విషయంలో ట్విటర్ను ఫేస్బుక్ సీఈవో మార్క్ జూకర్బర్గ్ కూడా తప్పుబట్టారు. సామాజిక మాధ్యమాలు ‘నిజ నిర్ధారకులు’ కాకూడదని ట్విటర్ను ఉద్దేశించి అన్నారు. ఈ విషయంలో ట్విటర్తో పోలిస్తే ఫేక్బుక్ విభిన్న పాలసీని అనుసరిస్తుందని ఓ వార్తా ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జూకర్బర్గ్ వెల్లడించారు. ప్రజలు ఆన్లైన్లో వ్యక్తం చేసే అభిప్రాయాలకు ప్రైవేటు కంపెనీలు నిజనిర్ధారకులుగా ఉండకూడదన్నారు. ముఖ్యంగా సామాజిక మాధ్యమాల సంస్థలు ఈ పని చేయకూడదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ‘మెయిల్-ఇన్-బ్యాలెట్’ అవలంభిస్తే అక్రమాలు జరిగే అవకాశం ఉందని ట్రంప్చేసిన అరోపణల్లో నిజమెంతో తెలుసుకోవాలని ట్విటర్ తాజాగా నెటిజన్లకు సూచించడం చర్చకు దారితీసింది.
మేము అదే కొనసాగిస్తాం: ట్విటర్
ట్విటర్ ఫ్యాక్ట్చెక్ ప్రకటనపై అంతర్జాతీయంగా వస్తున్న వార్తలకు ట్విటర్ సీఈఓ జాక్ డోర్సే స్పందించారు. ఎన్నికల సమయంలో వివాదాస్పద వ్యాఖ్యల్ని, అసత్య సమాచారాన్ని గుర్తించి ప్రజల ముందుంచడం వల్ల.. వారే దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుదనేది తమ భావన అని జాక్ డోర్సే స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే, అమెరికాలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సామాజిక మాధ్యమాల తీరు, ట్రంప్ వైఖరి మరోసారి చర్చనీయాంశం అయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ ఉక్కు భూముల విషయంలో యథాతథ స్థితి పాటించండి
-
‘యూటీఎస్’ పరిధి పెంపు.. ఇక ఎంత దూరం నుంచైనా జనరల్ టికెట్ కొనచ్చు..
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
-
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
-
ఓ అన్న మాట్లాడాల్సిన మాటలేనా?.. షర్మిల చీరపై జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు