రియాద్‌ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన విమానం!

‘వందే భారత్‌ మిషన్‌’లో భాగంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించే ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. దీనిలో భాగంగా ఆదివారం నాడు ఏయిరిండియా ప్రత్యేక విమానం సౌదీ అరేబియా రాజధాని రియాద్‌ నుంచి హైదరాబాద్‌ బయలుదేరింది.

Published : 31 May 2020 20:21 IST

దిల్లీ: ‘వందే భారత్‌ మిషన్‌’లో భాగంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించే ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. దీనిలో భాగంగా ఆదివారం నాడు ఏయిరిండియా ప్రత్యేక విమానం సౌదీ అరేబియా రాజధాని రియాద్‌ నుంచి హైదరాబాద్‌ బయలుదేరింది. దాదాపు 148 ప్రయాణికులతో కూడిన ఏఐ1936 విమానం ఈరోజు కింగ్‌ ఖలీద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌ బయలుదేరినట్లు సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. 148మంది ప్రయాణికుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నట్లు తెలిపింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని