రక్షణపరమైన మౌలిక వ్యవస్థలను నవీకరిస్తున్న భారత్
పాకిస్థాన్తో ఉన్న అంతర్జాతీయ సరిహద్దు(ఐబీ) వెంబడి రక్షణపరమైన మౌలికవ్యవస్థలను భారత్ బలోపేతం చేస్తోంది. భారత్-పాకిస్థాన్ మధ్య 2,289 కిలోమీటర్ల అంతర్జాతీయ సరిహద్దు ఉండగా.. అందులో 192 కిలోమీటర్లు జమ్మూ ప్రాంతంలోనే ఉంది.
పాక్ సరిహద్దులో జోరుగా పనులు
దిల్లీ: పాకిస్థాన్తో ఉన్న అంతర్జాతీయ సరిహద్దు(ఐబీ) వెంబడి రక్షణపరమైన మౌలికవ్యవస్థలను భారత్ బలోపేతం చేస్తోంది. భారత్-పాకిస్థాన్ మధ్య 2,289 కిలోమీటర్ల అంతర్జాతీయ సరిహద్దు ఉండగా.. అందులో 192 కిలోమీటర్లు జమ్మూ ప్రాంతంలోనే ఉంది. తొలి దశలో భాగంగా జమ్మూ ప్రాంతంలో 26 కిలోమీటర్ల పొడవునా పనులను చేపట్టారు. మరో 33 కిలోమీటర్ల పనులు కొనసాగుతున్నాయని అధికారిక వర్గాలు తెలిపాయి. సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) బంకర్లను పటిష్ఠం చేయడంతో పాటు సైనిక ట్యాంకుల రాకపోకలకు ర్యాంపులను నిర్మించారు. గట్ల పునరుద్ధరణ, కంచెలకు మరమ్మతులు, బీఎస్ఎఫ్ పోస్టుల నవీకరణ తదితర పనులూ ఉన్నాయని అధికారులు తెలిపారు. సరిహద్దు చెక్పోస్ట్లకు బీఎస్ఎఫ్ దళాలను తరలించే వాహనాలు సులువుగా ప్రయాణించేందుకు మట్టి రహదారులను చదును చేశారు. కశ్మీర్ ప్రాంతంలోనూ నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి ఈ పనులను చేపట్టారు. 2021లో రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత ఇంత భారీ ఎత్తున మౌలిక వ్యవస్థలను అభివృద్ధి చేయడం ఇదే తొలిసారి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
చిరంజీవిని విమర్శిస్తే ఖబడ్దార్.. వైకాపాకు సీఎం రమేశ్ హెచ్చరిక
-
రారండోయ్.. ఓటేయడానికి ఆంధ్రాకు
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!.. అరుదైన క్యాన్సర్తో పోరాడుతున్న బాలిక
-
ఓ అన్న మాట్లాడాల్సిన మాటలేనా?.. షర్మిల చీరపై జగన్ అభ్యంతరకర వ్యాఖ్యలు
-
కూకట్పల్లిలో హత్యాచారం కేసు.. 45 కిలోమీటర్లు.. 1400 సీసీ కెమెరాల జల్లెడ
-
కొడాలి నాని నామినేషన్.. వెలవెల