PM Modi: హెచ్ఏఎల్పై దుష్ప్రచారం చేసిన వారికి ఇదే సమాధానం: ప్రధాని మోదీ
రఫేల్ యుద్ధ విమానాల (Rafale Fighter Jets) ఒప్పందం విషయంలో తప్పుడు ఆరోపణలతో పార్లమెంట్ సమయాన్ని ప్రతిపక్షాలు వృథా చేశాయనీ.. వారందరికీ హెచ్ఏఎల్ హెలికాఫ్టర్ ఫ్యాక్టరీయే (HAL Helicopter Factory)సమాధానం అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
బెంగళూరు: రఫేల్ యుద్ధ విమానాల (Rafale Fighter Jets) ఒప్పందంపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని ప్రధాని మోదీ (PM Modi) మండిపడ్డారు. సోమవారం కర్ణాటక (Karnataka)లోని తుమకూరు(Tumakuru)లో హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) సంస్థకు చెందిన అతిపెద్ద హెలికాఫ్టర్ల (Helicopter) తయారీ యూనిట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా రఫేల్ ఒప్పందం విషయంలో ప్రతిపక్షాలు తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నాయని కాంగ్రెస్ (Congress)ను ఉద్దేశించి విమర్శించారు.
‘‘ హెచ్ఏఎల్ విషయంలో మా ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేసిన విపక్షాలకు సమాధానమే కొత్తగా ప్రారంభించిన ఈ హెలికాఫ్టర్ల తయారీ యూనిట్. రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందం విషయంలో తప్పుడు ఆరోపణలతో పార్లమెంట్ సమయాన్ని ప్రతిపక్షాలు వృథా చేశాయి. వారందరికీ హెచ్ఏఎల్ హెలికాఫ్టర్ ఫ్యాక్టరీయే సమాధానం. రక్షణ రంగంలో భారత్ ఆత్మనిర్భరతను ఈ ఫ్యాక్టరీ మరింత పెంచుతుంది’’ అని ప్రధాని అన్నారు. ఫ్రాన్స్ నుంచి భారత్ రఫేల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు యూపీఏ (UPA) ప్రభుత్వ హయాంలో ఒప్పందం జరిగింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన భాజపా (BJP) ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వ హయాంలో ఒప్పందం చేసుకున్న ధర కంటే రెట్టింపు ధరకు యుద్ధ విమానాలను కొనుగోలు చేసిందని కాంగ్రెస్ ఆరోపించింది.
2016లో మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 36 అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు నిమిత్తం ఫ్రాన్స్ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. అయితే, ఈ విమానాలను తయారు చేయాల్సిన డసో ఏవియేషన్ (Dassault Aviation) ఇండియా ఆఫ్సెట్ భాగస్వామిగా అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ డిఫెన్స్ (Reliance Defence)ను ఎంపిక చేసుకుంది. అయితే, ఎలాంటి అనుభవం లేని రిలయన్స్ డిఫెన్స్ను ఎలా చేర్చుకుంటారన్నది భారత్లో ప్రతిపక్షాలు కేంద్రంలోని ఎన్డీఏ (NDA) ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. ఆ సమయంలో హెచ్ఏఎల్ను విస్మరించి రిలయన్స్కు లబ్ది చేకూర్చేలా కేంద్రం వ్యవహరించిందంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
జి-7 సదస్సుకు మోదీని ఆహ్వానించిన ఇటలీ
జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే జి-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. -
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల